కామారెడ్డి క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించాలి…

కామరెడ్డి, డిసెంబరు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ముఖ్యమంత్రి కప్‌ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి బహుమతులు తీసుకరావాలనీ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సి.ఏం. కప్‌ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించి విజేతలకు మెడల్స్‌ , ప్రశంసా పత్రాలను కలెక్టర్‌ అందజేశారు.

రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో కామారెడ్డి జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి బహుమతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్‌ రివెంట్లలో విజేతలకు మెడల్స్‌, ప్రశంసా పత్రాలు అందజేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ, క్రమశిక్షణ అంకిత భావం కలిగి ఉంటే క్రీడల్లో రాణిస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులు అదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలో రాణించాలని తెలిపారు.

విద్యార్థులు చిన్ననాటి నుండే గ్రంథాలయాల్లో చదవాలని సూచించారు. సెల్‌ ఫోన్‌ ల బారిన పడకూడదని తెలిపారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఇందు ప్రియ మాట్లాడుతూ, హార్డ్‌ వర్క్‌ చేయడం ద్వారా రాష్ట్ర స్థాయి పోటీల్లో అవకాశం వచ్చిందని, మరింత కృషిచేసి రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలవాలని అన్నారు. అనంతరం విజేతలకు మెడల్స్‌, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి జగన్నాథ్‌, అథ్లెటిక్‌ జనరల్‌ సెక్రటరీ హరిలాల్‌, పలు పాఠశాలల ఫిజికల్‌ డైరెక్టర్లు, పి.ఈ.టీ.లు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »