ముగిసిన ఎం.ఈ.ఎస్‌ ప్రొబెషనరీ అధికారుల బృందం పర్యటన

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తమ శిక్షణలో భాగంగా క్షేత్ర స్థాయిలో వివిధ అంశాల అధ్యయనం కోసం నిజామాబాద్‌ కు హాజరైన మిలిటరీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ప్రొబెషనరీ అధికారుల బృందం పర్యటన శనివారం ముగిసింది. 30 మందితో కూడిన అధికారులను ఆరు బృందాలుగా విభజిస్తూ, ఒక్కో బృందానికి ఒక గ్రామం చొప్పున క్షేత్రస్థాయి అధ్యయనం జరిపించారు. మోర్తాడ్‌ మండలంలోని తిమ్మాపూర్‌, సుంకెట్‌, దొన్కల్‌, నందిపేట మండలంలోని సిద్దాపూర్‌, వన్నెల్‌(కె), వెల్మల్‌ గ్రామాలతో పాటు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రొబేషనరీ అధికారులతో కూడిన బృందాలు ఎనిమిది రోజుల పాటు వివిధ వర్గాల వారిని కలిసి వారి పనితీరును, ఆయా కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.

క్షేత్రస్ధాయి అధ్యయనానికి హాజరైన తమకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా తోడ్పాటును అందించిందని కృతజ్ఞతలు తెలుపుతూ వీడ్కోలు తీసుకున్నారు. ట్రైనీ అధికారులకు డీఆర్డీఓ సాయాగౌడ్‌, విజయేందర్‌ రెడ్డి, వివిధ శాఖల అధికారులు వీడ్కోలు పలికారు.

Check Also

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆర్మూర్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »