నేరగాళ్ల హింసలు సహించం….

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నేరాలలో నేర నిరూపణ అయిన దోషులు న్యాయమూర్తుల పట్ల హింస ప్రవృత్తితో ప్రవర్తించడాన్ని సహించబోమని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ హెచ్చరించారు.రంగారెడ్డి జిల్లాకోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న హరిష పై ఒక కేసులో నేర నిర్ధారణ అయిన దోషి ఒక వస్తువుతో దాడికి పాల్పడడం ఆందోళనకరమని ఆయన అన్నారు.

న్యాయస్థానాలలో నేర న్యాయ విచారణకు హాజరయ్యే నేర చరితగల ముద్దాయిల పట్ల కోర్టు భద్రత సిబ్బంది తగు జాగ్రతలతో వ్యవహరించాలని జగన్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు మంథని రాజేందర్‌ రెడ్డి మాట్లాడుతూ నేరమయ ముద్దాయిల పట్ల ముందస్తుగా సమాచారం తీసుకుని కోర్టులోకి భద్రత సిబ్బంది అనుమతించాలని తెలిపారు.

సీనియర్‌ న్యాయవాదులు ఎర్రం గణపతి, తుల గంగాధర్‌,గంగ ప్రసాద్‌,ఆశ నారాయణ, మద్దెపల్లి శంకర్‌ లు మాట్లాడుతు న్యాయమూర్తులు తమ విధినిర్వహణలో చట్ట ప్రకారమే వ్యవహరిస్తారని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న న్యాయవాదుల ఏకాభిప్రాయం మేరకు శుక్రవారం కోర్టుల విధులకు హాజరుకాకుండా నిరసన వ్యక్తం చేశారు. సమావేశంలో బార్‌ ఉపాధ్యక్షుడు పెండెమ్‌ రాజు, కార్యదర్శి సురేష్‌ దొన్పల్‌, న్యాయవాదులు దీపక్‌ మానిక్‌ రాజు, బాగిర్తి సాయిరెడ్డి, సదానంద్‌ గౌడ్‌, రత్నాకర్‌ రెడ్డి, విగ్నేష్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇంచార్జీ జిల్లాజడ్జికి వినతిపత్రం…

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, ఫిబ్రవరి.21, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »