కామారెడ్డి, మార్చ్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలుగువారి నూతన సంవత్సరం అయినటువంటి శ్రీ విశ్వావసు నామ ఉగాది సంవత్సరమును పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా టీఎన్జీవోస్, టీజీవో సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిథులుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయములో వేద పండితులు ఆంజనేయ శర్మ, వారి శిష్య బృందం చే శ్రీ విశ్వావసు నామ నూతన ఉగాది వేడుకలు, శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం లో రాష్ట్రం, కామారెడ్డి జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి అని చిన్న పాటి ఒడిదొడుకులు ఉన్న పాలనాపరమైన ముందు చూపుతో సమస్యలు తొలగుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అందరికీ శుభాలను తీసుకురావాలని తెలుపుతూ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, మహిళా పండితుల పంచగా శ్రవణం ప్రశంసిస్తూ, ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన టిఎన్జీవోస్ మరియు టీజీఓ సంఘాలను అభినందించారు.
పండితులు ఆంజనేయ శర్మ మాట్లాడుతూ కలక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు జరుపుకోవటం ఆనందంగా ఉందని, మహిళా పండితులతో పంచగా శ్రవణం మొట్టమొదటి సారిగా మన కామారెడ్డిలో జరిగిందని తెలిపారు. పంచాంగ శ్రవణం అనంతరం ఉగాది పచ్చడి వితరణ చేశారు.
కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ నరాల వెంకట్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దేవేందర్ మరియు సాయి రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఎం నాగరాజు, సహధ్యక్షులు ఎం చక్రధర్, కోశాధికారి ఎం దేవరాజు, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, జాయింట్ సెక్రెటరీ గణేష్, కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.