ఆపరేషన్‌ నిమిత్తమై సకాలంలో రక్తం అందజేత..

కామారెడ్డి, ఏప్రిల్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీ (38)కి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించక పోవడంతో మాచారెడ్డి మండలం లచ్చపేట్‌ కు చెందిన భూస రాజు మానవతా దృక్పథంతో స్పందించి ఆర్‌ విఎం వైద్యశాల ఒంటిమామిడి కి వెళ్లి 10 వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచినందుకు ఐవిఎఫ్‌ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ సంవత్సరానికి మూడుసార్లు రక్తదానం చేస్తూ ఎక్కడ ఎవరికి రక్తం అవసరం ఉన్న స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న రక్తదాత రాజు చేస్తున్న కృషి అభినందనీయమని, యువత రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడి ప్రాణదాతలు కావాలని అన్నారు.

Check Also

పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »