నిజామాబాద్, ఏప్రిల్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అనగారినవర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడిన వ్యక్తి, బహుజనులకు ఆత్మబంధువు మహాత్మా జ్యోతిరావు పూలే అని బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జోతిబా పులే జయంతి కార్యక్రమాన్ని జిల్లా కోర్టు అవరణంలోని బార్ అసోసియేషన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.
అధ్యక్షులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఫూలే అనేక సంస్కరణలు తీసుకువచ్చి మనుషుల్లో సమానత్వాన్ని పెంపొందించాలని సత్యశోధక్ సంస్ద ద్వారా అనేక విద్యాలయాలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించినటువంటి మహనీయుడు అన్నారు.
ప్రతి ఒక్కరు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలని, నేను కాదు నా సమాజం అనే ఆలోచన తోటి నడవాలని తెలిపారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి, న్యాయవాదులు వసంత్ రావు, ఆర్ రాజలింగం, గోవర్ధన్, పేదం రాజు, కవితా రెడ్డి, అంజలి, లిల్లి కిరణ్ కుమార్, విఘ్నేష్, వెంకటేష్, విశ్వాక్ సేన్ తదితరులు పాల్గొన్నారు.