Breaking News

గోదాములో విద్యుత్‌ పనులు పక్కాగా జరిపించాలి

నిజామాబాద్‌, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఇటీవల చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 2023 లో జరిగే ఎన్నికల కోసం కొత్తగా ఈ.వీ. ఎంలు జిల్లాకు రానున్నందున, వాటిని పక్కాగా భద్రపర్చేందుకు అవసరమైన జాగ్రత్తలు చేపడుతూ, గోడౌన్‌లో అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన కలెక్టర్‌, అవి నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు.

ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్లు, ఇతర సామాగ్రికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా గోడౌన్‌ లోనే పూర్తి స్థాయిలో సదుపాయాలు కలిగి ఉన్న గదుల్లో భద్రపర్చాలని, విద్యుత్‌ సంబంధిత పనులను పక్కాగా జరిపించాలని షార్ట్‌ సర్క్యూట్‌ వంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండరాదని హితవు పలికారు. కలెక్టర్‌ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్‌, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్‌ రావు, పంచాయతీ రాజ్‌ ఈ.ఈ శంకర్‌ రాథోడ్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

Check Also

అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »