రక్తదానం చేసిన వ్యవసాయ విస్తరణ అధికారి

కామారెడ్డి, జూలై 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మర్కల్‌ గ్రామానికీ చెందిన బాల్‌ నరసయ్య (79) కు ఆపరేషన్‌ నిమిత్తంమై బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో చిన్న మల్లారెడ్డి క్లస్టర్‌ వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్‌ రెడ్డి 16 వ సారి బి నెగిటివ్‌ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ రాత్రివేళ అయినా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు.

నేటి సమాజంలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే కావడం చాలా బాధాకరమని, మానవ జీవితానికి సార్ధకత పరోపకారమే అని ప్రతి ఒక్కరు తోటివారికి వీలైనంతవరకూ సహాయం చేయాలని కోరారు.

కరోనా వ్యాక్సిన్‌ కారణంగా పేషెంట్లకు కావలసిన రక్తం దొరకక చాలా మంది ప్రతిరోజు వివిధ రకాల గ్రూపుల రక్తం కోసమే సంప్రదించడం జరుగుతుందని, కావున రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినట్లయితే వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. కార్యక్రమంలో వి.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్లు చందన్‌, ఏసుగౌడ్‌ పాల్గొన్నారు.

Check Also

మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలి..

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »