బాన్సువాడ, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి గోదావరి పట్టభద్రులను కలిసి భర్త గెలుపు కోసం ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిజెపి పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ బిజెపి పార్టీ అన్నారు.
పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని, పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం తన భర్త నిరంతరం పనిచేస్తారన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తుప్తి ప్రసాద్, బాపురెడ్డి, మోహన్ రెడ్డి, శంకర్ గౌడ్, కోణాల గంగారెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, వెంకట్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.