Breaking News

    జూలై 6 నుంచి ఎం. ఎడ్‌. పరీక్షలు

    డిచ్‌పల్లి, జూన్‌ 29

    నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎడ్‌. రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు జూలై 6 నుంచి 9 తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్‌ విడుదల చేశారు.

    కావున ఎం.ఎడ్‌. కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో కొవిద్‌ – 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్‌ ధరించడం, ఎవరికి వారే శానిటైజర్‌, వాటర్‌ బాటిల్‌ వంటివి వెంట తెచ్చుకోవడం, 6 అడుగుల భౌతిక దూరం నియమంతో మెలగడం వంటివి సూచించారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

    Check Also

    నిజామాబాద్‌కు రూ. 30 లక్షల విలువచేసే అంబులెన్సు

    Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అథాంగ్‌ …

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »