Breaking News

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో ఎస్‌ఐకి సన్మానం

కామారెడ్డి, జూలై 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్లలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌వో కృష్ణమూర్తిని సన్మానించారు.

కాగా తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్‌ రెడ్డి చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా ఉత్తమ ఎస్‌ఐగా తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో కృష్ణమూర్తి అవార్డు తీసుకున్నారు. ఈ సందర్భంగా సన్మానించినట్టు జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ తాడ్వాయి మండలంలో శాంతిభద్రతల కోసం వారు శ్రమించిన తీరుకు అవార్డు నిదర్శనమని, దొంగతనాల నివారణకు యుద్దంలా మండలంలోని అన్ని గ్రామాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా గ్రామస్తులను చైతన్యం చేసి అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని అభినందించారు.

మండలంలో కరొనా నియంత్రణలో భాగంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, ఫ్రెండ్లీ పోలీస్‌ విధానాన్ని పాటిస్తూ నేటి యువతకు మంచి మార్గదర్శకాలు సూచిస్తున్నారన్నారు. తాడ్వాయి మండలానికి గొప్ప పేరుతో పాటు మండలాన్ని ఆదర్శంగా రాష్ట్ర స్థాయిలో నిలిపిన ఎస్‌ఐ కృష్ణమూర్తి కృషి మరువలేనిదని అన్నారు.

కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు చాకలి రాజు, ఎస్‌ జీ. తిరుపతి, వి. శివ కుమార్‌, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 గురువారం, ఏప్రిల్‌ 10, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »