జలకళ సంతరించుకున్న జన్నెపల్లి ఊర చెరువు

నవీపేట్‌, జూలై 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మూడు రోజుల నుండి కురుస్తున్న అతి భారీవర్షాలకు నవీపేట్‌ మండల కేంద్రంలోని జన్నెపల్లి గ్రామంలో గల ఊరచెరువు జలకళ సంతరించుకుంది. మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో జన్నెపల్లి గ్రామ చెరువు, వాగు పొంగిపొర్లడంతో గ్రామ ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సుమారు 200 ఎకరాలకు నీరు అందించే చెరువు నిండడంతో సాగునీటికి ఎటువంటి డోకా లేదని రైతులు భావిస్తున్నారు. నవీపేట్‌ మండలంలో అతి పెద్ద చెరువుగా జన్నెపల్లె చెరువు, వాగుకి పేరుండడంతో ప్రకృతి ప్రేమికులు జలకళని దర్శించేందుకు వెళుతున్నారు.

Check Also

బాబు జగ్జీవన్‌ రావు గొప్ప మానవీయ విలువలకు ప్రతిరూపం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »