Breaking News

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో నేతాజీ వర్ధంతి

కామరెడ్డి, ఆగష్టు 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సమీపంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు మాట్లాడుతూ సుభాష్‌ చంద్రబోస్‌ బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడిరచిన ధీరుడు, స్వతంత్ర సమరయోధుడు అన్నారు. అహింస మార్గంలోనే కాదు ఆయుధ పోరాటంతో కూడా బ్రిటిష్‌ వారిని తరిమికొట్టొచ్చు అని నమ్మి ఆచరణలో పెట్టిన స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు.

భారతదేశం స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి అని, ఆయన ధైర్యసాహసాలు మరువలేనివని అన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు కొమ్మరాజుల శ్రీనివాస్‌, మోతే లావణ్య, ధన్నరపు రామకృష్ణ, సంతోష్‌, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, ఏప్రిల్‌.7, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »