Breaking News

    టైక్వాండో ఇన్నర్‌లను అభినందించిన అదనపు కలెక్టర్‌

    నిజామాబాద్‌, నవంబర్‌ 1

    నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు చదువుతోపాటు మార్షల్‌ విద్యలో కూడా ప్రావీణ్యం అవసరం అని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. సోమవారం ప్రగతి భవన్‌లో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఏడుగురు క్రీడాకారులు హైదరాబాద్‌ ఎల్‌బి నగర్‌లో తైక్వాండో అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ మాస్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 31 న తైక్వాండో బ్లాక్‌ బెల్ట్‌ పరీక్షల్లో పాల్గొని బ్లాక్‌ బెల్ట్‌ పొందారు.

    అడిషనల్‌ కలెక్టర్‌ కలెక్టరేట్‌లో విద్యార్థులను అభినందించారు. విద్యతో పాటు టైక్వాండో, కరాటే ఇతర విషయాలను కూడా నేర్చుకుంటే వారికి ఇతరులకు రక్షణ కూడా ఉంటుందని జాతీయస్థాయిలో మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని పేర్కొన్నారు. కోచ్‌ మనోజ్‌ కుమార్‌ను అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

    Check Also

    నేటి పంచాంగం

    Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, ఏప్రిల్‌.7, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »