బాల్య వివాహాలు జరగకుండా చూడాలి…

కామారెడ్డి, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్య వివాహాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జిల్లా బాలల రక్షణ యూనిట్‌ జిల్లా లెవెల్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో బాల్య వివాహాలు జరిగితే 1098 నెంబర్‌ సమాచారం ఇవ్వాలని సూచించారు.

అనాధ బాలలకు రక్షణ కల్పించాలని కోరారు. బాలకార్మికుల నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలనపై గ్రామస్థాయిలో కళాజాత ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించే విధంగా చూడాలని పేర్కొన్నారు. మహిళల సంరక్షణ పై తీసుకుంటున్న చర్యలను చర్చించారు. అంగన్‌ వాడి కేంద్రాలలో బలహీనమైన పిల్లలకు అదనంగా పౌష్టికాహారం అందే విధంగా చూడాలని సూచించారు.

ఎస్పీ శ్వేత మాట్లాడుతూ బాల కార్మికులతో ఎవరైనా పనులు చేయిస్తే యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మహిళ, పిల్లల, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని సరస్వతి, సిడబ్ల్యూసి చైర్మన్‌ సత్యనారాయణ రెడ్డి, బాలల రక్షణ అధికారిని స్రవంతి, ఇన్చార్జి డిఎంఅండ్‌హెచ్‌ఓ చంద్రశేఖర్‌, సిడబ్ల్యూసి మెంబర్‌ స్వర్ణలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

భీమ్‌గల్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

Print 🖨 PDF 📄 eBook 📱 భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »