Breaking News

వైకల్యం ఉందని బాధపడొద్దు

కామారెడ్డి, జనవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు వైకల్యం ఉందని బాధపడవద్దని, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో మంగళవారం లూయిస్‌ బ్రెయిలీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు.

అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నతమైన వ్యక్తి లూయిస్‌ బ్రెయిలీ కొనియాడారు. అంధులు ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. స్వయం ఉపాధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా ఎదగాలని కోరారు. జిల్లా గ్రంధాలయంలో కంప్యూటర్‌ గదిలో 5 కంప్యూటర్లు అంధులకు కేటాయించి బ్రెయిలీ లిపి సాప్ట్‌వేర్‌ను ఏర్పాటు చేయిస్తామని పేర్కొన్నారు.

ఈ అవకాశాన్ని అంధులు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన అంధులను సన్మానించారు. బ్రెయిలీ లిపి 2022 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ఇన్చార్జి జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకట మాధవరావు, జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని సరస్వతి, మెప్మా పిడి శ్రీధర్‌ రెడ్డి, ప్రతినిధులు రవీందర్‌, హరి సింగ్‌, శివ గౌడ్‌, దివ్యాంగులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 గురువారం, ఏప్రిల్‌ 10, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »