Daily Archives: January 12, 2022

యువతకు ఆదర్శం స్వామి వివేకానంద

కమ్మర్‌పల్లి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా కమ్మరపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని …

Read More »

ప్రణాళిక బద్దంగా పారిశుద్య పనులు చేపట్టాలి

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ప్రణాళికాబద్ధంగా పారిశుద్ధ్య పనులను చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో బుధవారం మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని స్మశాన వాటిక లను, డంపింగ్‌ యార్డ్‌ లను వినియోగించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాలు …

Read More »

యువజన సమాజ్‌ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి

ఆర్మూర్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆర్మూర్‌ పట్టణంలోని క్షత్రియ యువజన సమాజ్‌ అధ్యక్షులు వడ్డీ ప్రశాంత్‌, కార్యదర్శి విశ్వనాథ్‌ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే ప్రశాంత్‌ మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆర్మూర్‌ పట్టణంలోని క్షత్రియ సమాజ్‌ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు నిర్వహించామని, భారత దేశ యువత స్వామి వివేకానంద …

Read More »

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహాల నిర్వహకుడు బాలు మాట్లాడుతూ వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు నడవాలని, ప్రపంచ దేశాలకు భారతదేశ ఖ్యాతిని ఇనుమడిరప చేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. కార్యక్రమంలో రక్తదాతల సమూహం …

Read More »

అన్ని వర్గాల ప్రజలు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రజలు సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో బుధవారం పోలీస్‌, ఆర్‌ అండ్‌ బి ఇంజనీరింగ్‌, రోడ్డు రవాణా శాఖ అధికారులతో రోడ్డు భద్రత నియమాలపై సమీక్ష నిర్వహించారు. హెల్మెట్‌ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది వ్యక్తులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »