Breaking News

జర్నలిస్టుపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలి

డిచ్‌పల్లి, జనవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండల సాక్షి దినపత్రిక విలేఖరి పోశెట్టి పై దాడి చేసిన టిఆర్‌ఎస్‌ కార్యకర్తలను అరెస్టు చేసి దాడికి సూత్రధారులైన వారిని కూడా అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయాలని పిడిఎస్‌యు, పివైఎల్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ నగరంలోని ద్వారక నగర్‌ ఇఫ్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు వనమాల సత్యం, జన్నారపు రాజేశ్వర్‌ మాట్లాడారు.

మాక్లూర్‌ మండలంలో రైతుబంధు సంబరాల్లో భాగంగా జరిగిన కార్యక్రమానికి సంబంధించి జడ్పీ చైర్మన్‌ దాదాన్నగారి విట్టల్‌ రావు అట్లాగే నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మధ్య విభేదాలు, అవినీతిపై వార్తలు రాసినందుకు టిఆర్‌ఎస్‌ కార్యకర్తలైన గుంజిలికి చెందిన రంజిత్‌, లక్కంపల్లికి చెందిన మహేందర్‌తో పాటు మరో వ్యక్తి కలిసిరోడ్డుపై కాపుకాసి పోశెట్టి అనే విలేకరిని కర్రలతో, రాడ్లతో దాడి చేసారని, పత్రికా స్వేచ్ఛకు పత్రిక విలేకరులకు రక్షణ లేని పరిస్థితులు నిజామాబాద్‌ జిల్లాలో ఉండటం విచారకరమని, అధికార అవినీతిపై ప్రశ్నించినందుకు అధికార పార్టీ దౌర్జన్యాలకు అంతులేకుండా పోతుందని దానికి అడ్డుకట్ట వేసే రోజులు ఎంతో దూరంలో లేవని వారు అన్నారు.

తక్షణమే దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేసి, దాడి చేయించిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాధిత విలేఖరికి అండగా పిడిఎస్‌యు, పివైఎల్‌ సంఘాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో పివైఎల్‌ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు దేశెట్టి సాయిరెడ్డి, డివిజన్‌ అధ్యక్షులు వసరి సాయినాథ్‌, పిడిఎస్‌యు నగర ఉపాధ్యక్షులు సాయి కృష్ణ, పివైఎల్‌ జిల్లా నాయకులు దేవస్వామి, పోశెట్టి, సూరి బాబు, కత్తుల సాయిలు, దాసు పాల్గొన్నారు.

Check Also

మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలి..

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »