Breaking News

దళితబంధు వేగంగా అమలు చేయాలి…

కామారెడ్డి, జనవరి 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితబంధు అమలును వేగవంతం చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ నుండి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హాజరయ్యారు. మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ నుండి ఎస్‌.సి. కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ శ్రీనివాస్‌, బీ.ఆర్‌.కె ఆర్‌ భవన్‌ నుండి సి.ఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సి.ఎం. కార్యాలయం కార్యదర్శి, ఎస్‌.సి. అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఎస్‌.సి కార్పొరేషన్‌ ఎం.డీ. కరుణాకర్‌ పాల్గొన్నారు.

దళిత బంధు అమలుపై పలు ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు జారీ చేశారు. రాష్ట్రంలోని 118 శాసన సభ నియోజక వర్గాల్లో ఈ పధకం అమలు చేయాలని నిర్ణయమని, ప్రతీ నియోజక వర్గంలో కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో 100 శాతం గ్రౌండిరగ్‌ చేయాలని, స్థానిక శాసన సభ్యుల సలహాతో లబ్దిదారులను ఎంపిక చేసి జాబితాను సంబంధిత జిల్లా ఇంచార్జ్‌ మంత్రులతో ఆమోదింపచేయాలన్నారు.

ప్రతీ లబ్ది దారుడికీ ఏ విధమైన బ్యాంకు లింకేజి లేకుండా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందచేయాలని, లబ్ది దారుడు కోరుకున్న యూనిట్‌నే ఎంపిక చేయాలని, ఒక్కొక్క లబ్ధిదారుడికి మంజూరైన రూ.10 లక్షలనుండి పదివేల రూపాయలతో ప్రత్యేకంగా దళిత బంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాలని, దేశంలోనే దళిత బంధు ఒక అద్భుతమైన పథకమన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో దళిత బందుకు రూ. 1200 కోట్ల కేటాయింపు జరిగిందని, ఇప్పటికే రూ. 100 కోట్లను విడుదల చేసామని, విడతల వారీగా మిగతా నిధుల విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే, వాసాల మర్రి, హుజురాబాద్‌లలో దళిత బంధు అమలులో ఉందని, ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లాలోని తిరుమల గిరి మండలం, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ మండలాల్లో కూడా అమలు చేస్తున్నారన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. ఫిబ్రవరి 5 వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జి అధికారులను నియమిస్తామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, డిఆర్‌డిఓ వెంకట మాధవరావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దయానంద్‌, జిల్లా షెడ్యూల్‌ కులాల సంక్షేమ అధికారిని రజిత, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా ఐసిడిఎస్‌ పిడి సరస్వతి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా సహకార అధికారిణి వసంత, అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 గురువారం, ఏప్రిల్‌ 10, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »