Breaking News

    పీడీఎస్‌ బియ్యం పట్టివేత

    కామారెడ్డి, ఏప్రిల్‌ 9

    నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా పీడీఎస్‌ బియ్యం వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తుడిని శనివారం కామారెడ్డి సిసిఎస్‌ పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు పంచముఖి హనుమాన్‌ మందిర పరిసర ప్రాంతంలో పట్టుకొని కామారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామారెడ్డి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన పబ్బ సాయి కుమార్‌ అలియాస్‌ చింటూ అక్రమంగా పిడిఎస్‌ బియ్యం రవాణా చేస్తుండగా వచ్చిన సమాచారం మేరకు హనుమాన్‌ ఆలయం సమీపంలోని బైరయ్య ఇంటి వద్ద వాహనాన్ని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. బొలెరో వాహనంలో 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు పిడిఎస్‌ బియ్యం ఉందన్నారు. పట్టుకున్న వారిలో సీసీఎస్‌, సిఐ మల్లేష్‌ గౌడ్‌, ఎస్‌ఐ ఉస్మాన్‌, గణపతి, రాజేందర్‌ సిబ్బంది ఉన్నారు.

    Check Also

    బాబు జగ్జీవన్‌ రామ్‌ సేవలు చిరస్మరణీయం…

    Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత …

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »