ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 11న సోమవారం రోజున మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడమైనదని వివరించారు. వచ్చే సోమవారం నుండి ఈ కార్యక్రమం తిరిగి యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆదివారం, ఫిబ్రవరి.16, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »