Breaking News

అఖిలభారతీయ భగవద్గీతా పచ్రార మండలి ఆధ్వర్యంలో జన్మాష్టమి వేడుకలు

నిజామాబాద్‌, ఆగష్టు 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని స్థానిక స్టేషన్‌ రోడ్డులోగల అఖిలభారతీయ భగవద్గీతా పచ్రార మండలిలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ భగవానునికి నవవిధ అభిషేకాలు, లోక కళ్యాణార్థం యజ్ఞం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలి ప్రధాన కార్యదర్శి మేడిచర్ల పభ్రాకర్‌ ఉపన్యసిస్తూ భాగవతంలో పేర్కొన్న శ్రీకృష్ణుని లీలలు, లోకానికి అందించిన భగవద్గీత గొప్పదనాన్ని భక్తులకు వివరించారు.

కార్యక్రమంలో అఖిలభారతీయ భగవద్గీతా పచ్రార మండలి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, గౌరవ అధ్యక్షుడు షిండే, పధ్రాన కార్యదర్శి మేడిచర్ల పభ్రాకర్‌, ఉపాధ్యక్షుడు యోగా రాంచందర్‌, జాయింట్‌ సెక్రెటరీ ఇంజనీర్‌ గంగాధర్‌, సభ్యులు వెంకటస్వామి, శంకర్‌, సాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి అన్నప్రసాదాన్ని వితరణ చేశారు.

Check Also

మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలి..

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »