Breaking News

Monthly Archives: November 2022

చిన్నమల్లారెడ్డిలో స్వచ్చత రన్‌

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్బంగా కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామ పంచాయతీలో స్వచ్చత రన్‌ నిర్వహించారు. గ్రామస్తులని భాగ స్వామ్యం చేసి టాయిలెట్‌ వాడకంపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అవగాహన కల్పించారు. గ్రామంలో ట్విన్‌ పిట్‌ టాయిలెట్‌ వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు. ట్విన్‌ పిట్‌ నిర్మాణంలో రెండు వేరు వేరు గుంతలు వుండడం వలన ఒక …

Read More »

జాగృతి ఆధ్వర్యంలో ఎంపి దిష్టి బొమ్మ దహనం

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాదు ఎంపీ అరవింద్‌ దిష్టి బొమ్మ ను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద దహనం చేశారు. తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో అరవింద్‌ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు చిట్టీమల్ల అనంత రాములు మాట్లాడుతూ కవితపై …

Read More »

ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌

రెంజల్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రహిమాన్‌తో పాటు మధ్యాహ్న భోజనం ఇంచార్జ్‌ అరుణ్‌ అనే ఉపాధ్యాయుని సస్పెన్షన్‌ చేశారు. వివరాల్లోకెళ్తే శుక్రవారం నలుగురు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వికటించడంతో వారిని నిజామబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇద్దరిని డిస్‌చార్జి చేయగా మరో ఇద్దరు విద్యార్థుల్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే …

Read More »

అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్‌. సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి 60 రోజుల్లోపు చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్‌ మానిటరింగ్‌ …

Read More »

ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతుల పంపిణి

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ, పదవ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ గ్రేడ్‌ పాయింట్లు సాధించిన విద్యార్థులను మరింతగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ కమిషనర్‌ డాక్టర్‌ యోగితా రాణా చేతి గడియారాలను బహుమతిగా పంపించారు. ఎస్సెస్సిలో 9.5 గ్రేడ్‌ పాయింట్లకు పైగా సాధించిన నందిపేట మండలం అయిలాపూర్‌ ఎస్సీ హాస్టల్‌ కు చెందిన …

Read More »

భూసారాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూసారాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. భూసారాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సద్గురు ఫౌండేషన్‌ తరపున ఢల్లీికి చెందిన జయసోలంకి, ప్రతీక్‌ యాదవ్‌ అనే ఇద్దరు యువకులు దేశ రాజధాని ఢల్లీి నుండి కోయంబత్తూరు వరకు సైకిల్‌ ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు …

Read More »

కోమన్‌పల్లిలో స్వచ్చత రన్‌

ఆర్మూర్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచం మరుగుదొడ్ల దినోత్సవం 19 నవంబర్‌ సందర్బంగా కోమన్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో స్వచ్చతా రన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పారిశుద్ధ్యం, భూగర్భజలాలు, స్వచ్ఛతను గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యార్థులు, పలువురు నాయకులు, స్వచ్చ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ నీరేడి రాజేశ్వర్‌, సెక్రెటరీ ప్రసాద్‌, కారోబార్‌ నవీన్‌, ప్రాథమిక, హై స్కూల్‌ బోధనా సిబ్బంది, …

Read More »

సమస్యలకు నిలయం… రుద్రూర్‌ బస్టాండ్‌,,,

బోధన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండల కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంగణం సమస్యలకు నిలయంగా మారిందని మహిళలు తెలిపారు. మహారాష్ట్ర ఇతర పట్టణాలకు వెళ్లే ప్రధాన రహదారులకు అడ్డగా ఉన్న రుద్రూర్‌ బస్టాండ్‌ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారిందని మహిళలు తెలిపారు. రుద్రూర్‌ మండల కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంతంలో సమస్యలను, వివరాలను ప్రయాణికులను, సిబ్బందిని అడిగి …

Read More »

కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ చంద్రమోహన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియను, ట్యాబ్‌ ఎంట్రీని, రికార్డులను పరీక్షించి సంతృప్తి వ్యక్తపరచారు. ట్యాబ్‌ ఎంట్రీ ఇంకా వేగవంతం చేయాలని సీఈఓ ను ఆదేశించారు. కౌలు రైతులకు …

Read More »

దేశ అభివృద్ధిలో ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి

కోటగిరి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు షాహిద్‌ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఇందిరా గాంధీ కుటుంబం స్వాతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిందని, జవహర్‌ లాల్‌ నెహ్రూ స్వాతంత్ర …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »