Yearly Archives: 2022

అటవీ భూములు ఆక్రమించకుండా చూడాలి

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూములు అక్రమణకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. అటవీ భూముల సంరక్షణ, హరితహారం కార్యక్రమంపై అధికారులతో శుక్రవారం కాన్ఫరెన్స్‌ హాల్లో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, అటవీ, పోలీస్‌ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి అటవీ భూములు ఆక్రమించకుండా చూడాలని సూచించారు. వచ్చే హరితహారంలో అటవీ భూములు అటవీశాఖ ఆధ్వర్యంలో …

Read More »

త్వరలో కారుణ్య నియామకాలు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అతి త్వరలోనే కారుణ్య నియామకాల ద్వారా 1200 సిబ్బందిని విడతల వారీగా నియమిస్తామని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ వెల్లడిరచారు. శుక్రవారం నిజామాబాద్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో తిరుమల బస్సులను ప్రారంభించారు. అనంతరం చైర్మన్‌ గోవర్ధన్‌ మాట్లాడుతూ టిఎస్‌ ఆర్‌టిసి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1016 నూతన బస్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆర్‌టిసికి చెల్లించాల్సిన ప్రభుత్వ బకాయిలు త్వరలో చెల్లించడం జరుగుతుందని …

Read More »

రెవెన్యూ యంత్రాంగంను అన్ని విధాలుగా సన్నద్ధం చేస్తున్నాం

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 15వ తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల కోసం జిల్లా యంత్రాంగాన్ని అన్ని విధాలుగా సన్నద్ధం చేసామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆదేశాల మేరకు రెవిన్యూ సదస్సుల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్‌డిఓలు, …

Read More »

సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలువాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ఈ నెల 15 వ తేదీ నుండి ప్రారంభం కానున్న మండల స్థాయి రెవెన్యూ సదస్సులను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లకు దిశానిర్దేశం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి …

Read More »

దాతల తోడ్పాటును సద్వినియోగం చేసుకుని కొలువులు సాధించాలి

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు దాతల తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని కోరుకున్న ప్రభుత్వ కొలువు సాధించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. ఈనాడు/ఈటీవీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థుల ఉపయోగార్థం దాతల నుండి సుమారు 7.50 లక్షల రూపాయల విలువ చేసే స్టడీ మెటీరియల్‌ సేకరించి లైబ్రరీలకు సమకూర్చారు. ఇందులో భాగంగానే శుక్రవారం …

Read More »

జోయాలుక్కాస్‌ ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ వ్యాపార సంస్థ అయిన జోయాలుక్కాస్‌ తన ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రశంసించారు. సుభాష్‌ నగర్‌లోని బాలసదన్‌ లో వసతి పొందుతున్న నలభై మంది అనాధ బాలలకు జోయాలుక్కాస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సుమారు రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే సామాగ్రిని ఉచితంగా సమకూర్చారు. బాలసదన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి …

Read More »

నందిపేట్‌లో వైఎస్‌ జయంతి

నందిపేట్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో శుక్రవారం యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత జననేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ చేసిన సేవలను గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను జ్ఞాపకం చేశారు. …

Read More »

బస్‌ షెల్టర్‌ నిర్మాణానికి భూమి పూజ

నందిపేట్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమ సమీపంలో గల ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌ విద్యార్థుల సౌకర్యార్థం లయన్స్‌ క్లబ్‌ నందిపేట ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన బస్‌ షెల్టర్‌ నిర్మాణానికి శుక్రవారం మంగి రాములు మహారాజ్‌ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ వలె ఇతర స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి సేవా …

Read More »

ప్లాస్టిక్‌ సంచులు పర్యావరణానికి ముప్పు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన నిత్యజీవితంలో భాగంగా మారిన ప్లాస్టిక్‌ సంచుల స్థానంలో బట్ట సంచులు వాడి పర్యావరణాన్ని రక్షించుకుందామని మల్లు స్వరాజ్యం మెమోరియల్‌ ట్రస్ట్‌ గౌరవ అధ్యక్షురాలు డా. జయనీ నెహ్రూ పిలుపునిచ్చారు. జనవిజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌ సంయుక్తంగా పంపిణీ కోసం తయారుచేసిన బట్ట సంచులను శుక్రవారం ఖలీల్‌వాడి స్వగృహంలో ఆమె విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆమె …

Read More »

పరీక్షల షెడ్యూల్‌ తేదీలలో మార్పు

డిచ్‌పల్లి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల్యంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ మొదటి, రెండవ, మూడవ, నాల్గవ, ఐదవ, ఆరవ, ఏడవ, ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ సెమిస్టర్స్‌ వన్‌ టైం చాన్స్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు జూలై 11 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఇదివరకు షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా వివిధ కోర్సులకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »