కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిని క్షయ రహిత జిల్లాగా మార్చాలని నేషనల్ టుబర్ క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం క్షయ వ్యాధి నియంత్రణపై పర్యవేక్షణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2025 నాటికి క్షయ వ్యాధిని అంతమొందించే దిశగా పర్యవేక్షకులు కృషి …
Read More »Yearly Archives: 2022
భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడు తహసిల్దార్ కార్యాలయాలను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ శుక్రవారం సందర్శించారు. లింగంపేట, తాడువాయి, పిట్లం తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ధరణిలో పెండిరగ్లో ఉన్న భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆయా మండలాల తహసిల్దారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Read More »గోదావరి తీరాన జింకల సందడి
నందిపేట్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని జిజి నడుకుడ గ్రామ గోదావరి తీరాన జింకలు సందడి చేస్తున్నాయి. గతంలో కూడా ప్రతి సంవత్సరం వర్షాకాల సమయంలో గోదావరి తీరాన పెద్ద సంఖ్యలో జింకలు వస్తున్నాయి. వీటిని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పక్షులు, జింకల రాక తో పర్యాటకుల సందడి పెరిగింది. గత సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో జింకలు సందడి చేసాయి. …
Read More »ఈ రోజు మంచి మాట
అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.
Read More »వారం వ్యవధిలో పెండిరగ్ పనులన్నీ పూర్తి కావాలి
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వారం రోజుల వ్యవధిలో విద్యుత్ సంబంధిత పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువు ముగిసిన మీదట ఏ ఒక్క పని కూడా పెండిరగ్ ఉండకూడదని సూచించారు. పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమంలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పనుల ప్రగతిపై కలెక్టర్ గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష …
Read More »శిక్షణ కోసం ఉర్దూ జర్నలిస్టులు పేర్లు పంపాలి
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న శిక్షణ తరగతుల కోసం ఆసక్తిగల ఉర్దూ జర్నలిస్టులు తమ పేర్లు పంపాలని నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి కోరారు. హైదరాబాదులోని ఉర్దూ మస్కాన్, ఖిల్వట్లో రెండు రోజుల పాటు శిక్షణా తరగతులు కొనసాగుతాయన్నారు. ఆసక్తి కలిగిన ఉర్దూ జర్నలిస్టులు …
Read More »అరుదైన క్యాన్సర్కు విజయవంతంగా ఆపరేషన్
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అరుదైన క్యాన్సర్కు విజయవంతంగా శస్త్రచకిత్స చేసిన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యంత అరుదైన క్యాన్సర్కు శస్త్రచకిత్స చేసిన జిల్లా ఆసుపత్రి వైద్యుల బృందానికి, సూపరింటెండేంట్ ప్రతిమరాజ్కి శుభాకాంక్షలు తెలిపారు. …
Read More »ముగ్గురు విద్యార్థులు డిబార్
డిచ్పల్లి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 7978 నమోదు చేసుకోగా …
Read More »కండబలం, గుండెబలం, బుద్ధిబలం కంటే సంకల్పబలం గొప్పది
డిచ్పల్లి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పోటీ పరీక్షల శిక్షణా విభాగం ఆధ్వర్యంలో న్యాయ కళాశాలలోని సమావేశ మందిరంలో గురువారం ఉదయం గ్రూప్ – 1 తదితర ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థి అభ్యర్థులకు పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్ అధికారి సి. పార్థసారథి ప్రధాన …
Read More »బృహత్ ప్రకృతి వనాల కోసం స్థలాలు గుర్తించాలి
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం ప్రతి మండలంలో స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 26 బృహత్ పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేసినట్లు చెప్పారు. 45 బృహత్ పల్లె ప్రకృతి …
Read More »