Yearly Archives: 2022

త్రిబుల్‌ ఐటిలో సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో శుక్రవారం బాసర త్రిబుల్‌ ఐటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ బాసర త్రిబుల్‌ ఐటీలో విద్యార్థులు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, తాగునీటి వసతిని, …

Read More »

టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ ఎప్పుడు

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యా సంవత్సరం ప్రారంభమై మన ఊరు – మనబడిలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను ఇంకెప్పుడు భర్తీ చేస్తారని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఎస్‌ ప్రదీప్‌ అన్నారు. నిజామాబాద్‌ ఎన్‌.ఆర్‌. భవన్‌లో పివైఎల్‌ జిల్లా కమిటీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …

Read More »

రూ. 11 కోట్లతో మోర్తాడ్‌ సర్వతోముఖాభివృద్ది

మోర్తాడ్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్‌ మండల కేంద్రంలో సుమారు 4.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు, డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ పనులకు గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూడు విడతల్లో మండల కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకునే విదంగా ప్రణాళిక రూపొందించినట్లు …

Read More »

సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో అవగాహన చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి లక్ష్మణ్‌ సింగ్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని మీటింగ్‌ హాల్‌లో ఆరోగ్య సేవలపై సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయిలో గర్భిణీల నమోదు కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు జరిగే విధంగా వైద్య సిబ్బంది కృషి చేయాలని …

Read More »

కోటగిరి హైస్కూలును తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులను పలుకరిస్తూ, భోజనం సక్రమంగానే అందిస్తున్నారా, రుచిగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. మన ఊరు – మన బడి నిధులతో చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించి, అధికారులకు పలు …

Read More »

డబ్బు ముఖ్యం కాదు … మంచి మనసు ఉండాలి

నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి సమాజంలో డబ్బులు కలిగి ఉండడం గొప్ప కాదని, అనాధలు, అభాగ్యులను ఆదుకునేందుకు మంచి మనసుతో ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం ఎక్లాస్పూర్‌కు చెందిన ప్రవాస భారతీయులైన శ్రీధర్‌, సుచిత్ర దంపతులు ఏడు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ అనాధ బాలల కోసం …

Read More »

గోడప్రతుల ఆవిష్కరణ

కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎస్పి కార్యాలయంలో జిల్లా ఎస్‌.పి. శ్రీనివాస్‌ రెడ్డి చేత ‘‘ప్రపంచ వయోవృద్దుల వేదింపులపై అవగావన దినోత్సవం’’ పోస్టర్‌ ని అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వయోవృద్దులకు పోషణ చట్టం 2007 Ê 2019 అమలు చేస్తూనే, దానికి అదనంగా భారతదేశ ప్రభుత్వం వయో వృద్ధులు తమపైన నిర్లక్ష్య వైఖరి, మానసిక, శారీరక, ఆర్థిక, లైంగిక …

Read More »

శ్రీశ్రీకి ప్రజా సంఘాల నివాళి

నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా కవి, విప్లవ రచయితల సంఘం (విరసం) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీశ్రీ 39 వ వర్ధంతి సందర్భంగా ప్రజాసంఘాల (ఐఎఫ్‌టియు, ఏఐకెఎంఎస్‌, పివైఎల్‌) ఆధ్వర్యంలో సీపీఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా కార్యాలయం ఎన్‌.ఆర్‌ భవన్‌, కోటగల్లిలో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏ.ఐ.కె.ఎం.ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. రామకృష్ణ మాట్లాడుతూ శ్రీశ్రీ సాంప్రదాయ కవిత్వాన్ని బద్దలు కొట్టి, ప్రజా …

Read More »

సర్కారు బడికి జడ్జి కూతురు

నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలే ప్రతిభాపాటవాలకు,ఉన్నతమైన చదువులకు, మేధా సంపత్తి గల ఉపాధ్యాయులకు అత్యుత్తమ విద్యాలయాలని నిరూపించారు నిజామాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌ కుమార్‌ జాదవ్‌, ప్రియాంక జాదవ్‌ దంపతులు. వీరిద్దరి ఐదేళ్ల కూతురు అంబికా జాదవ్‌ను నిజామాబాద్‌ నగరంలోని చంద్రశేఖర్‌ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో బుధవారం ప్రవేశపత్రం నింపి జాయిన్‌ చేశారు. ఈ …

Read More »

ఆలయానికి భూమి విరాళం

దోమకొండ, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండల కేంద్రంలోని మార్కండేయ మందిరానికి ముంబైలో స్థిరపడిన దోమకొండ గ్రామానికి చెందిన అందే శంకర్‌ ప్రమీల దంపతులు మంగళవారం రూ. 25 లక్షల విలువగల 460 గజాల భూమిని మార్కండేయ పద్మశాలి సంఘానికి విరాళంగా అందజేశారు. ఇంటింటికి మార్కండేయుడు కార్యక్రమంలో భాగంగా వారు భూమిని ఆలయ అధ్యక్షుడు ఐరేని నరసయ్య ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రతినిధుల సమక్షంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »