కామారెడ్డి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు మన ఊరు- మన బడి కార్యక్రమంలో పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపట్టనున్న …
Read More »Yearly Archives: 2022
పక్షం రోజుల్లోపు పనులు ప్రారంభించాలి
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉద్దేశించిన మన ఊరు-మన బడి కార్యక్రమం కింద అవసరమైన పనులను గుర్తిస్తూ, పక్షం రోజుల్లోపు అవి ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ సూచించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, విద్యా శాఖ, …
Read More »న్యాయవాదులకు అండగా ఉంటా…
కామారెడ్డి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాయవాదులందరికీ అండగా ఉంటానని, ఎల్లప్పుడూ తమ అవసరాల కోసం సంప్రదించాలని కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్లో గంప గోవర్ధన్ ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం మరో ఐదు …
Read More »ప్రతి మండలానికి రెండు పాఠశాలల్లో పనులు
కామారెడ్డి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి మండలానికి మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా రెండు పాఠశాలలను ఎంపిక చేసి పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బిచ్కుంద నుంచి జూమ్ కాన్ఫరెన్స్లో ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద పాఠశాలలో మరుగుదొడ్లు, వంటశాలలు, రక్షణ గోడ నిర్మాణం వంటి పనులు చేయడానికి ఇంజనీరింగ్ …
Read More »టీబీ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
కామారెడ్డి, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీబీ వ్యాధిని అంతమొందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనిజిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2024 నాటికి జిల్లాలో టీబీ వ్యాధి …
Read More »బస్తీ దవాఖాన కోసం భవన పరిశీలన
కామారెడ్డి, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరులో బస్తి దావఖాన ఏర్పాటుకోసం గ్రామ పంచాయతీ భవనం పక్కనే ఉన్న భవనాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. భవనంలో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ను ఆదేశించారు. భవనం బస్తి దావఖానకు అనుకూలంగా ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు …
Read More »ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్యా బోధన
నిజామాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి మరింత మెరుగైన విద్యా బోధన జరుగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడిరచారు. ప్రభుత్వ బడులను ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు అన్ని రకాల వసతులతో ఆకట్టుకోనున్నాయని ఆయన పేర్కొన్నారు. తద్వారా ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు మరింత …
Read More »కబడ్డీ టీంను అభినందించిన కలెక్టర్
కామారెడ్డి, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెలలో 18, 19, 20 వ తేదీలలో వికారాబాద్ జిల్లాలో రాష్ట్రస్థాయి అండర్ – 20 మహిళా కబడ్డీ విభాగంలో తృతీయ స్థానం సాధించిన కామారెడ్డి జిల్లా జట్టును గురువారం కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా విద్యాశాఖాధికారి రాజు, జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. …
Read More »ఆపరేషన్ నిమిత్తం రక్తదానం
కామారెడ్డి, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటకు చెందిన లాలమ్మల మంజులకు ఆపరేషన్ నిమిత్తమై పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో రక్తం అవసరం కావడంతో జిల్లా కేంద్రానికి చెందిన టాక్స్ కన్సల్టెంట్ శ్రీనివాస్కు తెలియజేయగానే మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ఓ పాజిటివ్ రక్తాన్ని అందజేశారని కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త బాలు తెలిపారు. గత 14 సంవత్సరాల నుండి …
Read More »లాభదాయకమైన యూనిట్లు ఎంపిక చేసుకొని సుస్థిర ఆదాయాన్ని పొందాలి
కామారెడ్డి, మార్చ్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం మగ్దుంపూర్, సుల్తాన్ నగర్, మహమ్మద్ నగర్, గునకల్ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో దళిత బంధుపై అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. లాభదాయక యూనిట్లు ఎంపిక చేసుకొని లబ్ధిదారులు ప్రతినెల ఆదాయం పొందాలని సూచించారు. మిగతా లబ్ధిదారులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ట్రాక్టర్లు, ఆటోలు సొంతంగా నడిపే …
Read More »