Yearly Archives: 2022

దళిత బంధు యూనిట్ల స్థాపనలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు యూనిట్ల ఎంపికతో పాటు వాటిని తమకు నచ్చిన చోట స్థాపించుకునే పూర్తి స్వేచ్ఛ లబ్ధిదారులకు ఉందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆంక్షలు, పరిమితులు ఉండవన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ శాసనసభ నియోజకవర్గం పరిధిలో దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్దిదారులతో బుధవారం స్థానిక ప్రగతి భవన్‌లో ఏర్పాటు …

Read More »

సొసైటీ అభివృద్ధికి కృషి

గాంధారి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల సొసైటీ పాలకవర్గ సమావేశం పెద్దభూరి సాయికుమార్‌ అధ్యక్షతన బుధవారం జరిగింది. సమావేశంలో సొసైటీ అభివృద్ధితో పాటు పలు అంశాలను చర్చించారు. సొసైటీ అభివృద్ధి కొరకు అందరూ కృషి చేయాలనీ చైర్మన్‌ సాయికుమార్‌ కోరారు. సభ్యుల నుండి సలహాలు, సూచనలు తీసుకున్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ ఉదల్‌ సింగ్‌, డైరెక్టర్లు అశోక్‌ రెడ్డి, తాడ్వాయి సంతోష్‌, వజీర్‌ …

Read More »

చెక్‌ డ్యామ్‌ నిర్మాణ పనులు ప్రారంభం

గాంధారి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని వాగులో సంగెం రేవు వద్ద నిర్మించే చెక్‌ డ్యామ్‌ నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్‌ సంజీవ్‌ యాదవ్‌ బుధవారం ప్రారంభించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని క్లస్టర్‌గా తీసుకోని 16 చెక్‌ డ్యామ్‌లను ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ మంజూరు చేశారని ఆయన తెలిపారు. సుమారు 36 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం కొనసాగుతుందని అన్నారు. …

Read More »

టీయూలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం

డిచ్‌పల్లి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ 1 ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. ఎన్‌. స్వప్న మరియు 4 ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. బి. స్రవంతి ఆధ్వర్యంలో మంగళవారం న్యాయ కళాశాల సమావేశ మందిరంలో ‘‘ప్రపంచ వినియోగదారుల దినోత్సవం’’ సందర్బంగా కోవిద్‌ – 19 పూర్వాపర కాలంలో వినియోగదారుల హక్కుల సంరక్షణ’’ అనే అంశంపై సదస్సు జరిగింది. సమావేశానికి నిజామాబాద్‌ నుంచి …

Read More »

విద్యుత్‌ వినియోగదారులకు విజ్ఞప్తి

కామారెడ్డి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేపు అనగా తేది 16.03.2022, బుధవారం ఉదయం 8.00 గంటల నుంచి 10.30 వరకు 11 కె.వి. విద్యానగర్‌ ఫీడర్‌ మీద మరమ్మత్తులు కారణంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుంది కాబట్టి వినియోగదారులు గమనించి సహకరించాలని డివిజనల్‌ ఇంజనీర్‌ సి.గణేశ్‌ తెలిపారు. విద్యా నగర్‌, ప్రియ డీలక్స్‌ రోడ్డు, మెయిన్‌ రోడ్డు, కోర్టు రోడ్డు, ఎన్‌జివోస్‌ కాలనీలో అంతరాయం …

Read More »

ఆర్మూర్‌ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత

ఆర్మూర్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్రంగా ఉన్న వైద్య సిబ్బంది కొరత తీర్చాలని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం అసెంబ్లీ జీరో అవర్‌లో మాట్లాడుతూ ఆర్మూర్‌ దవాఖాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఆర్మూర్‌ ఆసుపత్రి 30 నుంచి వంద పడకలకు అఫ్‌ గ్రేడ్‌ అయ్యిందని, భవనాల నిర్మాణం కూడా …

Read More »

దీర్ఘకాలిక వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి…

నిజామాబాద్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్‌ ఆధ్వర్యంలో నాగారంలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో మహిళలకు ఎయిడ్స్‌,టి.బి వ్యాధులపై అవగాహనా సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి ప్రవీణ్‌ రెడ్డి హాజరై ఎయిడ్స్‌ని ఎలా గుర్తించాలి, ఎయిడ్స్‌ను ఎలా నియంత్రణ చేయాలి, ఎయిడ్స్‌ వ్యాధి సోకాకుండ్‌ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, …

Read More »

ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రెట్టింపు ధర పలుకుతున్న ప్లాట్లు

కామారెడ్డి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని ధరణి టౌన్షిప్లు ప్లాట్ల ప్రత్యక్ష వేలం గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర చదరపు గజం కు రూ. 7 వేలు ఉందని, వేలం ద్వారా ప్రజలు కొన్ని ప్లాట్లు చదరపు గజంకు రూ.15,800 లకు దక్కించుకున్నారని …

Read More »

సైబర్‌ నేరాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

కామారెడ్డి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సైబర్‌ నేరాలు జరగకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలనిజిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన డిజిటల్‌ ఫైనాన్స్‌పై సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. …

Read More »

దళిత బంధులో ఎలాంటి అపోహలకు తావు లేదు

నిజామాబాద్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేదని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ పధకానికి సంబంధించిన నిధులు ఇప్పటికే జిల్లాకు మంజూరై సిద్ధంగా ఉన్నాయని, ఏప్రిల్‌ మొదటి వారం నుండి యూనిట్ల స్థాపన కోసం లబ్దిదారులకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. కలెక్టర్‌ మంగళవారం బోధన్‌ శాసనసభా నియోజకవర్గంలోని ఎడపల్లి మండలం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »