Yearly Archives: 2022

సిఎం జన్మదినం సందర్భంగా మోర్తాడ్‌లో అన్నదానం

మోర్తాడ్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మోర్తాడ్‌ మండల కేంద్రంలో మంగళవారం టిఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, మోర్తాడ్‌ మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్‌, మోర్తాడ్‌ జెడ్పిటిసి బద్దం రవి, వైస్‌ ఎంపీపీ తొగటి శ్రీనివాస్‌, మండలంలోని …

Read More »

పేదల సంక్షేమానికి ఉద్యోగులు కృషి చేయాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వ ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఉద్యోగుల అలాట్మెంట్‌లో టిఎన్జిఓఎస్‌ ప్రతినిధులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. …

Read More »

మీసేవ ద్వారా మేడారం ప్రసాదం పొందవచ్చు

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేడారం సమ్మక్క-సారాలమ్మ ప్రసాదాన్ని మీ సేవ కేంద్రాల ద్వారా అందించనున్నారు. భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేసిందని కామారెడ్డి జిల్లా మీ సేవ జిల్లా మేనేజర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసాదం పొందాలనుకునేవారు సమీపంలోని మీసేవ కేంద్రాలలో రూ.225 చెల్లిస్తే కొరియర్‌ ద్వారా నేరుగా ఇంటికే అందజేస్తారని చెప్పారు. ఇందులో …

Read More »

టీయూ ఎస్సీ, ఎస్టీ సెల్‌ డైరెక్టర్‌ గా డా. భ్రమరాంబిక

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్‌ డైరెక్టర్‌గా కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. భ్రమరాంబిక నియామకం పొందారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ కె. శివశంకర్‌ జారీ చేశారు. డా. భ్రమరాంబిక ఇది వరకు పీజీ కాంఫిడెన్షియల్‌ అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, కాంపిటేటీవ్‌ సెల్‌ డైరెక్టర్‌గా, పబ్లికేషన్‌ …

Read More »

పుస్తక పఠనం గొప్ప అభిరుచి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుస్తకాలు అందించే జ్ఞానం జీవితాన్ని గొప్పగా నడిపిస్తాయని, పుస్తక పఠనం ప్రపంచంలోనే అత్యంత మంచి అభిరుచి అని ప్రముఖ సమాజ సేవకుడు మంచాల జ్ఞానేందర్‌ గుప్తా అన్నారు. ఫిబ్రవరి 14 ప్రపంచ పుస్తక వితరణ దినోత్సవం సందర్భంగా హరిద రచయితల సంఘం ఆధ్వర్యంలో నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. …

Read More »

మంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌

వర్ని, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జిల్లా పర్యటనను పురస్కరించుకుని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సోమవారం నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌. నాగరాజు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం పరిధిలోని చద్మల్‌, పైడిమల్‌, నంకోల్‌ చెరువుల సామర్థ్యం పెంపు, కాలువల …

Read More »

కోవిద్‌ కాలం ద్వారా జండర్‌ వివక్ష ఇంకా కొనసాగుతుందని నిరూపితమైంది

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మహిళా విభాగం డైరెక్టర్‌ డా. కె. అపర్ణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ‘‘జండర్‌ ఈక్వాలిటీ – ఇష్యూస్‌ అండ్‌ చాలెంజెస్‌’’ (జండర్‌ సమానత్వం – సమస్యలు, సవాళ్లు) అనే అంశంపై వెబినార్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎకనామిక్స్‌ విభాగం విశ్రాంతాచార్యులు, సోషల్‌ సైన్స్‌ డీన్‌ ఆచార్య తోటా జ్యోతీ రాణి విచ్చేసి …

Read More »

స్పెషల్‌ బి.ఇడి ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు మార్చి 11 చివరితేదీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నిర్వహించే స్పెషల్‌ బి.ఇడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు చివరితేదీ మార్చి 11 అని అధ్యయన కేంద్ర రీజనల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మానసికంగా చెవులకు, కళ్ళు సంబంధిత అంగవైకల్యంతో ఉన్న పిల్లలకు బోధించడానికి స్పెషల్‌ బి.ఇడి ఉపయోగపడుతుందన్నారు. బి.ఏ., బి.కాం., బి.ఎస్‌సి., బి.సి.ఏ., బి.బి.ఎం., బి.ఇ., …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం – దంపతుల మృతి

కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోమకొండ పెట్రోల్‌ పంపు వద్ద డీసీఎం వ్యాన్‌, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు రమేశ్‌ (46), సరస్వతి (38)గా గుర్తించారు. వీరి స్వస్థలం మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం నష్కల్‌. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి …

Read More »

నీట్‌లో భీమ్‌గల్‌ విద్యార్థిని ప్రతిభ

భీమ్‌గల్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణ కేంద్రంలోని వ్యాపారవేత్త అయిన అరే రఘు, సునీతల కూతురు అరే తేజస్విని 2021 నీట్‌ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనపర్చి తన సత్తా చాటుకుంది. అందుకుగాను అరే తేజస్వినికి నేషనల్‌ ఎంట్రన్స్‌ కం ఎలిజిబిల్‌ టెస్ట్‌లో అల్‌ ఓవర్‌ ఇండియాలో 5363, ఓబిసి రిజర్వేషన్‌లో 1868, తెలంగాణలో 161 ర్యాంక్‌ సాధించినందుకు సోమవారం వేల్పూర్‌ రోడ్డులోని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »