నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ (ఓల్డ్ బ్యాచ్, సి.బి.సి.ఎస్) పరీక్షలు గతంలో జనవరి 17 నుండి ఫిబ్రవరి 8 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడగా, తిరిగి ఫిబ్రవరి 7 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు అధికాలు పేర్కొన్నారు. డిగ్రీ (ఓల్డ్ బ్యాచ్) మూడో సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు. అదేవిధంగా …
Read More »Yearly Archives: 2022
మార్చి నెలాఖరు నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ మేరకు గ్రామ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు తమ వంతు తోడ్పాటును అందించాలని కలెక్టర్ కోరారు. మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్ నుండి వివిధ శాఖల అధికారులతో సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఆర్ అండ్ …
Read More »హాస్టల్స్ను సందర్శించిన వీసీ
డిచ్పల్లి, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర, బాలికల హాస్టల్స్ను మంగళవారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ సందర్శించారు. పాత బాలుర హాస్టల్లో జరుగుతున్న మరమ్మత్తు పనులను పర్యవేక్షించారు. హాస్టల్స్ గదులకు రంగులు వేయడం, తలుపులు, కిటికీలకు వడ్రంగి పని, గోడలకు, నేలకు రంధ్రాలు పడిన చోట సిమెంట్ పనులు, కుల్లాయిలను బాగుచేయడం, పాడైపోయిన కొత్త బల్బులను …
Read More »సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్, సిహెచ్ఓకు మెమో
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా సరిహద్దు ప్రాంతమైన బోధన్ మండలంలోని సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధుల్లో లేకుండా గైర్హాజర్ అయిన సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ను సస్పెండ్ చేశారు. అదేవిధంగా పీహెచ్సిలో అందుబాటులో లేని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రమీలకు వివరణ కోరుతూ ఛార్జ్ మెమో జారీ చేయాలని కలెక్టర్ సి.నారాయణ …
Read More »దళిత బంధులో విరివిగా యూనిట్లు గుర్తించాలి
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు అధికారులు విరివిగా యూనిట్లను గుర్తించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం స్థానిక ప్రగతి భవన్లో దళిత బంధు పథకంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు గుర్తించిన యూనిట్లు, రూపొందించిన నివేదికల గురించి శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఆరు రంగాలలో 60 …
Read More »అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులే ప్రజల మన్ననలు పొందుతారు
కామరెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులే ప్రజల మన్ననలు పొందుతారని డిఆర్డివో పిడి వెంకట మాధవరావు అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గణాంక అధికారిణి మహిజదేవి స్వచ్ఛంద పదవీ విరమణ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 33 ఏళ్ల పాటు ఆమె విశేష సేవలందించారని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులకే ప్రజలకు సేవ చేసే …
Read More »గ్రామీణ రోడ్డు మరమ్మతులకు భారీగా నిధులు మంజూరు
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2021-22 ఆర్థిక సంవత్సరంలో కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్డు మరమ్మత్తులకు 7 కోట్ల 6 లక్షల 70వేల రూపాయలు మంజూరైనట్టు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు. బిక్నూర్ మండలం జంగంపల్లి బిటి రోడ్ 24 లక్షలు, బస్వాపూర్ ఎస్సి వాడ 57 లక్షలు, చాకలి వాడ 22 లక్షలు, బిక్నూర్ నుండి సిద్దిరామేశ్వర టెంపుల్ …
Read More »పెంచిన వేతనాలు అమలు చేయాలి
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐ.ఎఫ్.టి.యు, సిఐటియు, ఏఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ చిత్ర మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర …
Read More »మొక్కలను పశువులు మేస్తే వాటి యజమానులపై చర్యలు
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం మొక్కలను పశువులు మేస్తే, నిబంధనలకు అనుగుణంగా కఠినంగా వ్యవహరిస్తూ వాటి యజమానులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్తో కలిసి కలెక్టర్ నారాయణ రెడ్డి సోమవారం 44వ నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు పరిశీలించారు. డిచ్పల్లి, సుద్దపల్లి, గనియతాండ, సికింద్రాపూర్, వివేకనగర్ తండా, …
Read More »రైల్వే ప్రయాణాలలో రాయితీలు కొనసాగించాలి
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా పేరుతో గత రెండు సంవత్సరాలుగా రైల్వే ప్రయాణాలలో సీనియర్ సిటిజన్లకు, మహిళలకు, వికలాంగులకు, ఇతర వర్గాలకు ఇప్పటివరకు ఉన్న రాయితీలను తొలగించటం సరైనది కాదని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు సీర్పా …
Read More »