కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో శనివారం కరోనా నియంత్రణ, దళిత బంధు అమలుపై జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కరోనా నియంత్రణకు మొదటి విడత డోసులు 92 శాతం, రెండో …
Read More »Yearly Archives: 2022
ఫిబ్రవరి 5 లోపు లబ్దిదారుల ఎంపిక పూర్తికావాలి
నిజామాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది లబ్దిదారులను ఎంపిక చేసి దళితబంధు అమలు అయ్యేలా చూడాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం దళిత బంధు పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి …
Read More »డ్రైనేజీ పనులను ప్రారంభించిన నాయకులు
నిజాంసాగర్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామంలో మండల పరిషత్ నిధులు ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గా రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్, వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచుల సంఘం అధ్యక్షులు రమేష్ గౌడ్ కలసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో …
Read More »సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
నిజాంసాగర్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోచ గౌడ్కు 60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోల దుర్గారెడ్డి, పిట్లం ఏఎంసి వైస్ చైర్మన్ గైని విఠల్, వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచ్ పిట్ల అనసూయ సత్యనారాయణ కలిసి లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు దేవదాస్, నాయకులు ప్రవీణ్ …
Read More »దళితబంధు వేగంగా అమలు చేయాలి…
కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళితబంధు అమలును వేగవంతం చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుండి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ నుండి ఎస్.సి. కార్పొరేషన్ ఛైర్మెన్ …
Read More »ఆరోగ్య సర్వే పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి….
వేల్పూర్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగావేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో పకడ్బందీగా నిర్వహిస్తున్న ఇంటింటి ఆరోగ్య సర్వే బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య సర్వే పకడ్బందీగా నిర్వహించాలని థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కరోణ పాజిటివ్ బాధితులు నిబంధనలు తప్పకుండా పాటించాలని …
Read More »బాలరక్ష వాహనాన్ని ప్రారంభించిన మంత్రి
కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల రక్ష వాహనాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జెండా ఊపి బాలరక్షక భవన్ వాహనాన్ని ప్రారంభించారు. సేవలు అందించేందుకు బాల రక్షక్ వాహనం అందుబాటులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న పిల్లలను త్వరగా కాపాడడానికి …
Read More »గుండె ఆపరేషన్ నిమిత్తం సనత్ కుమార్ శర్మ రక్తదానం
కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకు చెందిన ఖాసిం (49) నారాయణ వైద్యశాల హైదరాబాదులో గుండె ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో దోమకొండకి చెందిన హైదరాబాదులో నివాసం ఉంటున్న సనత్ కుమార్ శర్మకు తెలియజేయడంతో వెంటనే స్పందించి 62వ సారి రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని …
Read More »అంబులెన్స్ను ప్రారంభించిన మంత్రి
నిజామాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా జనరల్ ఆసుపత్రికి ప్రభుత్వం కేటాయించిన అధునాతన అంబులెన్స్ను శనివారం కలెక్టరేట్ లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అంబులెన్స్ను రోగుల సౌకర్యం కోసం హ్యూందాయ్ కంపెనీ ప్రభుత్వానికి వితరణ చేయడంతో, ప్రభుత్వం దానిని నిజామాబాద్ జీజీహెచ్కు కేటాయించిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు. అంబులెన్స్లో వెంటిలేటర్తో పాటు …
Read More »అకౌంటెంట్ల బదిలీలు చేపట్టాలి
నిజామాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీబీవీల్లో పనిచేస్తున్న అకౌంటెంట్లకు బదిలీలు చేపట్టాలని, కొత్తగా ఎంపికైన అకౌంటెంట్లకు పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్-టీచింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) ఆధ్వర్యంలో కలెక్టరేట్లో, డీఈవో కార్యాలయంలో ఏడీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బందికి గతంలో బదిలీలు చేసినారని, కానీ అకౌంటెంట్లకు …
Read More »