కామారెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 9 ప్లాట్లు, ఒక గృహం వేలం పాట ద్వారా విక్రయించగా రూ.1.14 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. గురువారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ధరణి టౌన్షిప్ లోని ప్లాట్లకు వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 20 ఫ్లాట్లు, 45 గృహాలకు వేలంపాట నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో …
Read More »Yearly Archives: 2022
సమస్యల పరిష్కారానికి అధికారులు శ్రద్ద చూపాలి
కామారెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశంలో చర్చించిన అంశాలు, వాటిని పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాను అన్ని …
Read More »నందిపేట్ మండలానికి ఫైర్స్టేషన్ మంజూరు
నందిపేట్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలానికి ప్రభుత్వం కొత్తగా ఫైర్స్టేషన్ మంజూరు చేసింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు కొత్తగా 15 నూతన ఫైర్ స్టేషన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. కాగా నందిపేట్ మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పలుసార్లు ప్రభుత్వానికి …
Read More »తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత సమాజానిదే
కామారెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 21వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆలయ సేవకులు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు ప్రతి 20 రోజులకు …
Read More »నవీపేట్లో ఘోర రోడ్డు ప్రమాదం
నవీపేట్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ సమీపంలో నిజామాబాద్ నుండి వస్తున్న లారీ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరితో పాటు ఇద్దరు వీఆర్ఏలకు తీవ్ర సైతం గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని సుభాష్ నగర్లో నివాసముంటున్న ఉదయ్ (14), సాయి తేజ (14) లు 9వ తరగతి చదువుతున్నారు. ఇద్దరు కలిసి …
Read More »విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు పెంపొందించాలి
నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన సూచించారు. బుధవారం ఆమె జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి తో కలిసి నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ముందుగా ముబారక్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, ఆయా తరగతుల విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించారు. చిన్నారులను పలు …
Read More »యూనియన్ స్వర్ణోత్సవాలకు తరలిరావాలి
ఆర్మూర్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో చేపూర్ గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. సభకు యూనియన్ ఆర్గనైజర్ నజీర్ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న హజరై మాట్లాడారు. మన యూనియన్ ఆవిర్భవించి డిసెంబర్ 10నాటికి 50 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో స్వర్ణోత్సవ సభ నిర్వహించాలని యూనియన్ …
Read More »55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం నిజామాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంధాలయములో ఏ.వెంకటేశ్వర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ విచ్చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న పాఠకులను ఉద్దేశించి వారికి సలహాలు-సూచనలు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి పి.లక్ష్మీరాజ్యం, సహాయ గ్రంథపాలకులు పట్టెమ్.మధు, సిబ్బంది స్వామి, పాఠకులు పాల్గొన్నారు.
Read More »కామారెడ్డిలో యువసమ్మేళనం
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిక్నూర్, దోమకొండ, బీబీపేట్, రాజంపేట, మాచారెడ్డి, రామారెడ్డి, తాడ్వాయి, లింగంపేట్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, గాంధారి, సదాశివ నగర్, కామారెడ్డి రూరల్ మండలాల యువసమ్మేళనం ఈనెల 17న కామారెడ్డి పట్టణం సిరిసిల్లా రోడ్డులోగల రాజారెడ్డి గార్డెన్స్లో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవ సమితి పత్రినిధులు తెలిపారు. నైజాం అరాచక పాలన నుండి తెలంగాణ (హైదరాబాద్ సంస్థానం) విముక్తి …
Read More »షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా బాలుకు అవార్డు
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్లో బుధవారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కరోనా వారియర్ అవార్డును రెడ్ క్రాస్ జిల్లా, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలుకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ అందజేశారు. కరోనా సమయంలో 1000 యూనిట్ల రక్తాన్ని, 100 యూనిట్ల ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి …
Read More »