నిజామాబాద్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్ కార్మికులకు అర్హులైన వారందరికీ ప్రమోషన్ కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. ప్రమోషన్లు ఇవ్వాలని ఎన్ఎంఆర్ కార్మికులకు 22 జీవో ప్రకారం ఆరునెలల సర్వీస్ పొడిగించి పర్మినెంట్ చేయాలని ఆయన కోరారు. మంగళవారం కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాదులో వినతిపత్రం అందించారు. …
Read More »Yearly Archives: 2022
పోటాపోటీగా వేలం పాడి ప్లాట్లు దక్కించుకున్న బిడ్డర్లు
నిజామాబాద్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా నెలకొల్పిన ధాత్రి టౌన్ షిప్లో ప్లాట్ల విక్రయాల కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన బహిరంగ వేలం ప్రక్రియ మంగళవారం సాయంత్రం నాటితో ముగిసింది. మొదటి రోజైన సోమవారం 40 ప్లాట్లకు సంబంధించిన వేలం పూర్తవగా, మంగళవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి నేతృత్వంలో మిగతా 40 ప్లాట్లకు …
Read More »29 నుండి సెమిస్టర్ ఎగ్జామ్స్
డిచ్పల్లి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎం.ఇడి 2వ, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 29 నుండి ప్రారంభం అవుతాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు.
Read More »ఓటర్లు, ఆధార్ అనుసంధానం చేసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల నమోదు పగడ్బందీగా చేపట్టాలని ఎలక్ట్రాల్ రోల్ అబ్జర్వర్ డాక్టర్ యోగితా రాణా అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఓటర్లు, ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఫామ్ 6 బి నింపి ఆధార్ నకలు స్వచ్ఛందంగా అందజేయాలని కోరారు. ఓటర్ల జాబితాలో మృతి …
Read More »బూత్ లెవల్ అధికారులు కొత్త ఓటర్లను నమోదు చేయాలి
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల సమ్మర్ రివిజన్లో మార్పు వచ్చిందని ఎలక్ట్రాల్ రోల్ అబ్జర్వర్ డాక్టర్ యోగితా రాణా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం ఆమె ఓటరు నమోదుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జనవరి 1,2023 వరకు 18 ఏళ్లు నిండిన వారు, ఏప్రిల్ 1,2023 వరకు 18 ఏళ్ల నిండిన వారు, జులై 1,2023 …
Read More »పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన అధికారులు
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండు పోలింగ్ కేంద్రాలను మంగళవారం ఎలక్ట్రాల్ రోల్ అబ్జర్వర్ డాక్టర్ యోగితరాణా పరిశీలించారు. పాత రాజంపేటలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని చూశారు. జనవరి 1,2023 నాటికి 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామంలో మృతి చెందిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. …
Read More »ధాత్రిలో రూ.1.63 కోట్ల ఆదాయం
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నచ్చిన ప్లాట్లు, గృహాలు రాకపోతే బుదవారం వేలంలో పాల్గొనవచ్చని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ధరణి టౌన్షిప్ వేలంపాట కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ధరణి టౌన్షిప్లోని ప్లాట్లు, వివిధ దశలలో నిర్మాణం పూర్తయిన గృహాలకు ప్రత్యక్ష వేలం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గలవారు వేలం పాటలో పాల్గొని …
Read More »నాణ్యమైన పరిశోధన జరగాలి
హైదరాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక సమస్యలు, ఆందోళనలకు పరిష్కారం చూపే దిశగా నాణ్యమైన పరిశోధన జరగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి, ఐసీఎస్ఎస్ఆర్ -ఎస్ఆర్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ డి. రవిందర్ యాదర్ ఆకాంక్షించారు. భిన్న విభాగాల మేళవింపుతో పరిశోధనలు – విధానపరమైన చిక్కులపై దృష్టి సారించాలని సూచించారు. పరిశోధనల్లో కేస్ స్టడీస్ను అభివృద్ధి చేయటానికి ఉన్న ప్రాముఖ్యతను వీసీ వివరించారు. అధ్యాపకులు, పరిశోధన విధ్యార్థుల …
Read More »అంగన్వాడీ టీచర్లను, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
నిజామాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లను,ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని (ఏ.ఐ.ఎస్.బి) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి, జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాల తరబడి చిన్న పిల్లలకు, ప్రజలకు సేవ చేస్తున్న అంగన్వాడీ టీచర్లను, వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని …
Read More »కామారెడ్డిలో ఉచిత ఈసీజీ పరీక్షలు
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ మధుమోహం దినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం శ్రీ పద్మావతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె పరీక్షలు, ఈసీజీ, బీపీ పరీక్షలు నిర్వహించారు. కామారెడ్డి రూరల్ ప్రజలు 200 మందికి పైగా హాజరై ఉచిత పరీక్షలు చేసుకున్నారు. కార్యక్రమంలో శ్రీ పద్మావతి హాస్పిటల్ డాక్టర్ ఎన్ మౌనిక, ఎంబిబిఎస్, ఎండి, జనరల్ మెడిసిన్, డయాబెటిస్ స్పెషలిస్ట్ …
Read More »