నిజామాబాద్, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్టోబర్ 2 గాంధీ జయంతిన మొదలైన స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలోని కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి తిలక్ గార్డెన్లో, పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్లాస్టిక్ను సేకరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ మాట్లాడుతూ మన అలవాట్లే మన భవిష్యత్ను మారుస్తాయని, దేశాన్ని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని, తెలిసో …
Read More »Yearly Archives: 2022
నవంబర్ 15 నాటికి పనులన్నీ పూర్తి కావాలి
మాక్లూర్, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని మాక్లుర్ మండలంలో గల చిన్నాపూర్ వద్ద గల అర్బన్ పార్క్ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం సందర్శించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన పనులతో పాటు వివిధ దశల్లో కొనసాగుతున్న ప్రగతి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. ఓపెన్ జిమ్లు, ప్లే జోన్ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్ ట్యాంకులు, వాచ్ టవర్, రోడ్డు నిర్మాణాలను …
Read More »ఈనెల 31లోగా బిందు సేద్య సౌకర్యం కల్పించాలి
కామారెడ్డి, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో మొదటి విడతలో 855 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు బిందు సేద్యం సౌకర్యం ఈ నెల 31 లోగా కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా ఉద్యానవన శాఖ అధికారులతో బిందు సేద్యం ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫామ్ సాగుచేసే …
Read More »పోలీసు అమరవీరుల సేవలు మరువలేని…
రెంజల్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివని, విధి నిర్వహణలో అమరులైన అమర జవానుల సేవలు ప్రజలలో చిరస్మరణీయంగా ఉంటాయని ఏసీపీ కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రజలకు సేవలందించడంలో అంకిత భావం ప్రదర్శిస్తూ పోలీసులు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుటుంబ సభ్యులకు దూరమయ్యారని ఏసిపి గుర్తు …
Read More »ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య…
రెంజల్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం రెంజల్ గ్రామానికి చెందిన శ్రావన్ గౌడ్ (29) ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. గత కొంతకాలంగా మృతుడు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న …
Read More »కల్కి భగవాన్ ఆలయంలో అన్నదానం
కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కల్కి ఆలయంలో గత 3 సంవత్సరాలుగా ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని మంగళవారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ సేవకులు ఏర్రం చంద్రశేఖర్, డాక్టర్ బాలు లు మాట్లాడుతూ శ్రీ అమ్మ భగవానుల సూచనల మేరకు 2020 సంవత్సరంలో అన్నదాన కార్యక్రమాన్ని ఆలయంలో ప్రారంభించడం జరిగిందని నిర్విరామంగా గత 3 …
Read More »28న మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 28 న ఏఐటీయూసీ అనుబంధ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్టు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య తెలిపారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ రాష్ట్ర మూడవ మహాసభలు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో యూనియన్ రాష్ట్ర …
Read More »నగదు రహిత వైద్యాన్ని అందించాలి
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో నగదు రహిత వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. హెల్త్ కార్డు నిరుపయోగంగా మారిందని ప్రైవేటు ఆసుపత్రులు అనుమతించడం లేదని, …
Read More »ఓటరు జాబితాలో మార్పునకు దరఖాస్తులు
కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు చేయదలచుకున్న వ్యక్తులు ఫారం (8) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా ఓటరు నమోదు కొరకు ఫామ్ (6) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బూతు లెవెల్ అధికారుల వద్ద, …
Read More »సరైన వసతులులేని కళాశాలలకు అఫిలియేషన్ ఇవ్వొద్దు
డిచ్పల్లి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో గల కనీస వసతులు లేని బిఈడి కళాశాలలకు అనుమతి ఇవ్వకూడదని వివిధ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రవీందర్ గుప్తాకు వినతి పత్రం అందజేశారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, జివిఎస్, ఏఐఎస్బి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి …
Read More »