నిజామాబాద్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సైతం పరీక్షా కేంద్రాలను సందర్శించారు.జిల్లా కేంద్రంలోని కాకతీయ కళాశాలలోని రెండు ఎగ్జామ్ సెంటర్లను, గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన …
Read More »Yearly Archives: 2022
కామారెడ్డిలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల క్షేత్ర పర్యటన
కామారెడ్డి, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను ఆదివారం హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా సందర్శించారు. కలెక్టరేట్ భవనం మ్యాప్ను పరిశీలించారు. భవనంలోని వివిధ డిపార్ట్మెంట్ల భవనాలను చూశారు. అనంతరం సమావేశం మందిరంలో ఆర్ అండ్ బి డి ఈఈ జాలిగామ శ్రీనివాస్, ఏఈఈ రవితేజ, వక్త ఉష రెడ్డి సముదాయంలో ఉన్న …
Read More »కామారెడ్డిలో 81.60 శాతం హాజరు నమోదు
కామారెడ్డి, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్కే డిగ్రీ కళాశాల, సందీపని జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాలలో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు నిర్వహణ ప్రక్రియను …
Read More »రెండు ఆర్టీసీ బస్సులు డీ, ప్రయాణికులకు గాయాలు
మాక్లూర్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని మాక్లుర్ మండలం చిన్నాపూర్ అర్బన్ పార్క్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సులు మరో ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న మాక్లుర్ ఎస్సై యాదగిరి గౌడ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తమ పోలీసు వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన వారిని 108 …
Read More »ఘనంగా బోనాల పండుగ
రెంజల్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని రెంజల్, దూపల్లి, సాటా పూర్, బొర్గం, తాడ్ బిలోలి, కునేపల్లి, బాగేపల్లి, కళ్యాపూర్ గ్రామాలలో ఆదివారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. గ్రామంలోని గ్రామదేవతలకు మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతియేటా గ్రామంలోని గ్రామదేవతలకు బోనాలను సమర్పించడం ఆనవాయితీ. వేడుకలో సర్పంచ్లు రమేష్ కుమార్, …
Read More »చిరుధాన్యాల పంటలతో అధిక లాభాలు
ఎడపల్లి, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంట మార్పిడి చేసి నూతన పద్ధతుల్లో చిరుధాన్యాలను పండిరచడానికి రైతులు ముందుకు రావాలని చిరుధాన్యాల పంటలతో అధిక దిగుబడులు సాధించి అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన మహిళా కిసాన్ దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు …
Read More »కంటి వైద్య శిబిరానికి చక్కని స్పందన…
రెంజల్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మండలంలోని వివిధ గ్రామాల నుండి అధికసంఖ్యలో కంటి సమస్యలున్న వారు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. 130 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 38 మందికి మోతి బిందు ఆపరేషన్ కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి …
Read More »సైన్స్ అండ్ టెక్నాలజీ పై అవగాహన
ఎడపల్లి, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థి దశ నుండి విద్యార్థుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల అవగాహన పెంపొందించాలని ఇస్రో శాస్త్రవేత్త శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఇస్రో ఫేస్ వీక్లో భాగంగా ఎడపల్లి గురుకుల పాఠశాలలో పాఠశాల, కళాశాల విద్యార్థినిలకు ఇస్రో ప్రయోగాల గురించి వివరించారు. విద్యార్థులు తమ భవిష్యత్తులో ఉద్యోగాలపైన ఆధారపడకుండా సైన్స్ అండ్ …
Read More »పంటల మార్పిడి వల్ల ఏమవుతుందో తెలుసా?
కామారెడ్డి, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఏటా ఒకే రకం పంటను సాగు చేయడం వల్ల నేలలో పోషకాల స్థాయి తగ్గుతుందని జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో(ఆత్మ) మహిళా కిసాన్ దివస్ పురస్కరించుకొని శనివారం గ్రామీణ ప్రాంతాల రైతులకు చిరుధాన్యాల సాగు, పోషణ విలువల ఆవశ్యకతపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. …
Read More »విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించాలి
నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వ్యాప్తంగా గల అన్ని గ్రామ పంచాయతీలు విద్యుత్ బకాయిలను తక్షణమే చెల్లించేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ శనివారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ సచివాలయాలు ఉత్తర తెలంగాణ …
Read More »