నిజామాబాద్, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న రెండు ప్రైవేట్ ఆసుపత్రులను బుధవారం సీజ్ చేశామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో సదుపాయాలు, నిబంధనల అమలు తీరును పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలచే ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తూ, సరైన లేబర్ రూమ్, ఇతర …
Read More »Yearly Archives: 2022
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగాలి
నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య కొంతవరకు పెరిగినప్పటికీ, మరింత గణనీయంగా మెరుగుపడాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. సుఖ ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రుల్లో చేరిన గర్భిణీలు ఎవరైనా కాన్పు జరుగకముందే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలివెళ్లకుండా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వాసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. మంగళవారం సాయంత్రం వైద్యారోగ్య శాఖ పనితీరును కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ …
Read More »రైతు భీమా చెక్కు పంపిణీ
కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ రామరెడ్డి మండల పరిధిలోగల గొల్లపల్లిలో యువరైతు వజ్జపల్లి సురేష్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలల్లో భాగంగా ఎక్కడ ఏ రైతు ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ఒక్క గుంట భూమి ఉన్న రైతులకు …
Read More »పారదర్శకంగా ధాన్యం సేకరణ ప్రక్రియ
నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ధాన్యం సేకరణ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా నిర్వహించేందుకు గాను సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, ఐకెపి సీసీలు, రైస్ …
Read More »విద్యార్థులు పోటీతత్వం అలవరుచుకోవాలి
కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా గ్రంధాలయంలో మంగళవారం కెనరా బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కెనరా బ్యాంక్ వినియోగదారులకు మెరుగైన సేవలందించడంతోపాటు సామాజిక సేవలు అందించడంలో ముందంజలో ఉందని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురికా …
Read More »ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యతతో పనులు …
Read More »మానవ అక్రమ రవాణా హేయమైన చర్య…
ఎడపల్లి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ క్లస్టర్ ఐసిడిఎస్, ప్రజ్వళ సంస్థ, హైదరాబాద్ వారు సంయుక్తంగా సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో అంగన్వాడీ కార్యకర్తలకు మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలపై రెండు రోజుల పాటు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజ్వళ సంస్థ ట్రైనింగ్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ చంద్రయ్య, రఫీ మాట్లాడుతూ మనుషుల అక్రమ రవాణా హేయమైన …
Read More »బైక్ దొంగల అరెస్ట్
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ ప్రాంతాలలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె. ఆర్.నాగరాజు వెల్లడిరచారు. దొంగల నుండి 70 లక్షల విలువ గల 42 బైక్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సిపి నాగరాజు వివరించారు. నిజామాబాద్ నగరానికి చెందిన షేక్ …
Read More »పొరపాట్లకు తావులేకుండా గ్రూప్-1 ప్రిలిమ్స్
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఈ నెల 16 వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష సందర్భంగా ఏ చిన్న పొరపాటుకు సైతం తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లలో భాగంగా సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో చీఫ్ సూపరింటెండెంట్లతో …
Read More »ధాన్యం మిల్లింగ్ వేగవంతం చేయాలి
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం మిల్లింగ్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం రైస్ మిల్లుల యజమానులతో ధాన్యం మిల్లింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రైస్ మిల్లుల యజమానులు రోజువారి లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. రోజుకు 464 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ …
Read More »