Monthly Archives: January 2023

జనవరి 5న తుది జాబితా విడుదల చేస్తాం

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 5న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తామని ఎన్నికల అబ్జర్వర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. 1 నుంచి 8 ఫార్మాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో83.19 శాతం ఓటర్లది ఆధార అనుసంధానం చేశారని పేర్కొన్నారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకల నిర్వహణపై వివరాలను …

Read More »

జాతీయ రహదారి పక్కన పచ్చదనం పెంపొందించాలి

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా మీదుగా వెళ్తున్న 44 వ నెంబర్‌ జాతీయ రహదారికి ఇరువైపులా పచ్చదనం పెంపొందించేలా పక్కా ప్రణాళికతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా సరిహద్దు ప్రాంతమైన చంద్రాయన్పల్లి నుండి డిచ్‌ పల్లి వరకు హైవేకు ఆనుకుని నాటిన మొక్కలను, వాటి నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. అక్కడక్కడా …

Read More »

108 సేవలకు గుర్తింపుగా కుర్చీలు, ఫ్యాన్లు అందజేత

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జిల్లా కేంద్రంలోని 108 అంబులెన్స్‌ చేస్తున్న సేవలు గుర్తించి బస్సా సాయిలు వారి తండ్రి బాస్స బాలయ్య జ్ఞాపకార్థం తన వంతుగా ఐదు కుర్చీలు ఒక ఫ్యాను అందజేశారు. 108 సేవలు మరువలేనివని, పేద, ధనిక అనే తేడా లేకుండా ఫోన్‌ రావడంతోనే వారు చేస్తున్న పనిని చూసి ఆసక్తికరమైన కొన్ని సన్నివేశాలు తాను చూడడం …

Read More »

గంజాయిపై ఉక్కుపాదం

వేల్పూర్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పచ్చని జీవితాలను విచ్ఛిన్నం చేస్తూ ఆరోగ్యకర సమాజాన్ని పాడు చేస్తున్న గంజాయి మహమ్మారిని అంతమొందించాలని నిజామాబాద్‌ జిల్లా పోలీస్‌ యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అదేశించారు. మంగళవారం నిజామాబాద్‌ సి.పి నాగరాజు, కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి పలువురు పోలీసు అధికారులు మంత్రిని వేల్పూర్‌ క్యాంపు కార్యాలయంలో కలిసి నూతన …

Read More »

పారదర్శకంగా ఓటర్ల తుది జాబితా

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా తుది ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకులు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ బి.మహేష్‌ దత్‌ ఎక్కా సూచించారు. మంగళవారం ఆయన కలెక్టర్‌ సి.నారాయణరెడ్డితో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆయా శాసన సభ నియోజకవర్గాల ఎన్నికల అధికారులు, …

Read More »

పిఆర్టియు కాలమాని ఆవిష్కరణ

రెంజల్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ దివ్యంగుల పాఠశాలలో మంగళవారం పిఆర్టియు నూతన కాలమానిని ఎంపీపీ లోలపు రజినీ కిషోర్‌, జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌, పిఆర్టియు అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం, సాయరెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేయడంలో పిఆర్టియు ఎప్పుడు ముందుంటుందని ఉపాధ్యాయుల పక్షాన అనునిత్యం వారి గొంతుకై …

Read More »

మహిళా హక్కుల తొలి గళం సావిత్రి బాయి పూలే

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే 191వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేవలం బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా అగ్రవర్ణాల నిరుపేదలకు కూడ తాను స్థాపించిన పాఠశాలలో 150 సంవత్సరాల క్రిందటే చదువు నేర్పిన గొప్ప దార్శనికురాలు సావిత్రి బాయి ఫూలే అని, తమ జీవిత కాలంలో …

Read More »

నిస్వార్థ సేవకులే కామారెడ్డి రక్తదాతలు…

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మల్లుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ కి ములుగులో గల ఆర్విఎం వైద్యశాలలో వెన్నుముక ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగటివ్‌ రక్తం అవసరం కావడంతో గత రెండు రోజుల నుండి ప్రయత్నించినప్పటికీ వారికి కావలసినటువంటి రక్తం ఆ వైద్యశాలలో లభించలేదు. ఇదే విషయాన్ని టెక్రియల్‌ గ్రామానికి చెందిన రాజుకు తెలియజేయగానే వెంటనే స్పందించి కామారెడ్డి నుండి ములుగు …

Read More »

వివాహిత ఆత్మహత్య

రెంజల్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని వీరన్నగుట్ట తాండకు చెందిన రాథోడ్‌ శాంతాబాయి (45) అనే వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్‌ఐ సాయన్న తెలిపారు. మృతురాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుందన్నారు. ఆమెకు జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిరదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.

Read More »

పెర్కిట్‌ మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

ఆర్మూర్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గ పరిధిలోని పెర్కిట్‌ గ్రామంలో పెర్కిట్‌ మున్నూరుకాపు సంఘంలో 2023 నూతన కార్యవర్గం నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యక్షుడిగా బాశెట్టి చిన్నారాజన్న, కోశాధికారిగా (క్యాషర్‌) జక్క రమణయ్య, అలాగే గ్రామంలో పెర్కిట్‌ గ్రామాభివృద్ధి కమిటీకి సొన్న నాగరాజుని ఎన్నుకున్నారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ మున్నూరుకాపు సంఘం యొక్క అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, అలాగే సంఘంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »