Breaking News

పంట నష్టం వివరాలు సేకరించాలి

కామారెడ్డి, మే 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :
వడగళ్ల వానతో పంట నష్టం జరిగిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి అధికారులతో పంట నష్టం వివరాలపై సమీక్ష నిర్వహించారు.

రెవెన్యూ, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పంట నష్టం వివరాలను సేకరించాలని పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్స్లో ఆర్డీవోలు శ్రీనివాస్‌ రెడ్డి, శీను, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా సీతారాముల కళ్యాణం

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »