బాన్సువాడ, మే 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్టం సాధించిన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత తొమ్మిది సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పల్లె పల్లెన ప్రజలకు వివరిస్తూ ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మంగళవారం బాన్సువాడలో నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభాపతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. బాన్సువాడ నియోజకవర్గ, మండలం,గ్రామ స్థాయిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి కట్టుగా ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. జూన్ 2 న పతాకావిష్కరణ, దశాబ్ది ఉత్సవ సందేశంతో ఉత్సవాలు ప్రారంభమై జూన్ 22 అమరవీరులకు సంతాపంతో ముగియనున్నట్లు తెలిపారు.
20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని, తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలన్నారు. రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటు, నూతన మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత దగ్గరైందని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం లో సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు.
నియోజకవర్గంలో గడిచిన తొమ్మిదేళ్ళుగా అన్ని రంగాలలో ఎంతో అభివృద్ది సాధించిందని, అభివృద్ధి వివరాలకు గడప గడపకు చేరేలా ప్రజా ప్రతినిధుల,అధికారులు కృషి చేయాలన్నారు. పోస్టర్ లు, కరపత్రాలు, ప్రతి గ్రామంలో మూడు ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గం ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అభివృద్ధి చేశానని తనకు సంతృప్తిగా ఉందని తెలిపారు. జూన్ 3న రైతు దినోత్సవం రోజు రైతు వేదికలను విద్యుత్ దీపాలతో, పూలతో అలంకరణ చేయాలని చెప్పారు. రైతుబంధు, రైతు బీమా పొందిన కొందరి లబ్ధిదారులతో సమావేశంలో మాట్లాడిరచాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల కార్యచరణ ప్రణాళికను వివరించారు. వచ్చే నెల జూన్ 2 నుంచి 22 వరకు జిల్లాలో జరుగు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామల నుంచి జిల్లా స్థాయి వరకు.. ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమాల సమన్వయం బాధ్యుల వివరాలను వెల్లడిరచారు.
కామారెడ్డి జిల్లా దశాబ్ది ప్రగతితో పాటు తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని.. చాటేలా జిల్లాలో పండుగ వాతావరణంలో వైభవోపేతంగా నిర్వహించేందుకు కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేశామని ప్రజాప్రతినిధుల సహకారం ఉంటేనే క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు విజయవంతం అవుతాయని చెప్పారు. ప్రజా ప్రతినిధులు వేడుకల్లో క్రీయశీలక భాగస్వామ్యం కావాలని కోరారు.
ప్రజా ప్రతినిధులు గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాలను అధికారులను సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణం లో నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.