Breaking News

ఆదివాసి నాయకపోడు మండల కమిటీల ఎన్నిక

ఆర్మూర్‌, జూలై 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలోని ఆదివాసి నాయకపోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షులు గాండ్ల రామచందర్‌ ఆధ్వర్యంలో మండల కమిటీలు శుక్రవారం నిర్వహించారు. ఆర్మూర్‌ మండల ఆదివాసి నాయకపోడు సేవా సంఘం మండల అధ్యక్షులుగా పుట్ట శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా మేడిపల్లి గౌతమ్‌, ఉపాధ్యక్షులుగా గంగనర్సయ్య, కోశాధికారిగా ఏర్రం వంశీ, కార్యదర్శిగా సింగిరెడ్డి సాయిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ మండల కమిటీలు కలిసికట్టుగా పనిచేసి ఆదివాసి నాయకపోడు సభ్యులకు ఏ సమస్య వచ్చినా ముందుండి వారి సమస్యలను తీర్చాలని అన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను ఆదివాసి నాయకపోడు సభ్యులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి రతం అరుణ్‌, ఉపాధ్యక్షులు ముడ అశోక్‌, ముఖ్య సలహాదారు సింగిరెడ్డి మోహన్‌ పాల్గొన్నారు.

Check Also

ఘనంగా సీతారాముల కళ్యాణం

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »