Breaking News

ఎండు గంజాయి స్వాధీనం… ఇద్దరు వ్యక్తుల అరెస్టు

ఆర్మూర్‌, జూలై 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డీపీఈవో ఆదేశాల మేరకు ఎక్సైజ్‌ ఎస్‌హెచ్‌వో ఆర్మూర్‌ బృందం పెర్కిట్‌లో దాడులు నిర్వహించి పాన్‌షాపులో ఎండు గంజాయి విక్రయిస్తున్నట్టు గుర్తించి 200 గ్రాములు స్వాధీనం చేసుకుని షేక్‌ నయీం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను షేక్‌ సోఫియాన్‌ అనే వ్యక్తి నుండి కొనుగోలు చేసినట్లు వెల్లడిరచాడు.

ఎక్సైజ్‌ బృందం షేక్‌ సోఫియాన్‌ను కూడా అరెస్టు చేశారు. పాన్‌షాప్‌ యజమాని షేక్‌ నయీమ్‌కు సరఫరా చేస్తున్నప్పుడు 1000 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రక్రియలో పాన్‌షాప్‌ యజమాని మరో 1000 గ్రాముల కోసం ఆర్డర్‌ చేయమని ఆదేశించాడు, గంజాయిని డెలివరీ చేస్తున్నప్పుడు ఎక్సైజ్‌ బృందం సరఫరాదారు షేక్‌ సోఫియాన్‌, విక్రేత షేక్‌ నయీమ్‌లను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి మొత్తం 1.200 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.

ఈ దాడుల్లో ఎక్సైజ్‌ సిఐ కె.స్టీవెన్‌ సన్‌, ఎస్‌ఐ ఏ. గంగాధర్‌, ఎస్‌ఐ. జె. ప్రమోద్‌ చైతన్య, ఎస్‌ఐ చంద్రమౌళి, సిబ్బంది ఉన్నారు.

Check Also

ఘనంగా సీతారాముల కళ్యాణం

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »