Breaking News

    శాంతియుత వాతావరణంతో పండుగలు జరుపుకోవాలి

    రెంజల్‌, సెప్టెంబర్‌ 22

    నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేష్‌ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఏసీపీ కెఎమ్‌ కిరణ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని సాటాపూర్‌ గ్రామంలోని రైతువేదికలో మండలంలోని అన్ని గ్రామాల గణేష్‌ మండపాల నిర్వహుకులతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ కెఎం కిరణ్‌ కుమార్‌ మాట్లాడారు.

    గ్రామాల్లో గణేష్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని నిమార్జనోత్సవాన్ని అందరూ కలిసి ఐక్యంగా జరుపుకోవాలని అన్నారు.

    కార్యక్రమంలో రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ రాజ్‌, ఎస్సై ఉదయ్‌ కుమార్‌, వైస్‌ ఎంపీపీ క్యాతం యోగేష్‌, సర్పంచ్‌ లు రమేష్‌ కుమార్‌, వికార్‌ పాషా, సాయిలు, రెంజల్‌ విండో చైర్మన్‌ మోహినోద్దీన్‌, బీజేపీ మండల అధ్యక్షుడు గోపికృష్ణ, రైతుబంధు మండల అధ్యక్షుడు కాశం సాయిలు, నాయకులు మేక సంతోష్‌, రాఘవేందర్‌, రొడ్డ లింగం, నితిన్‌, సాయిబాబా గౌడ్‌, రాంచందర్‌ తదితరులు ఉన్నారు.

    Check Also

    నేటి పంచాంగం

    Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, ఏప్రిల్‌.7, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »