Breaking News

4న కవి సమ్మేళనం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

డిసెంబర్‌ 4వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్‌ రోడ్డులోని మాణిక్‌బండార్‌లోని నవ్యభారతి గ్లోబల్‌ స్కూల్‌ సమావేశ మందిరంలో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం, సరస్వతీరాజ్‌-హరిదా ప్రతిభా పురస్కారాలు ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హరిదా రచయితల సంఘం అధికార ప్రతినిధి నరాల సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రి ముఖ్యఅతిథిగా, ప్రఖ్యాత రచయిత్రి డాక్టర్‌ అమృతలత, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వి శంకర్‌ , నవ్య భారతి విద్యాసంస్థల చైర్మన్‌ క్యాతం సంతోష్‌ కుమార్‌ గౌరవ అతిథులుగా హాజరవుతారని, రాష్ట్రం నలుమూలల నుంచి కవులు కవయిత్రులు కవిత గానం చేస్తారని ఆయన అన్నారు.

జిల్లాలోని సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సుధాకర్‌ కోరారు.

Check Also

బాబు జగ్జీవన్‌ రామ్‌ సేవలు చిరస్మరణీయం…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »