Breaking News

ప్రశాంతంగా గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష

కామారెడ్డి, జూన్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ఆదివారం స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏ, బి బ్లాకులు, ఎస్‌ ఆర్‌ కే డిగ్రీ కాలేజీ, వి ఆర్‌ కే డిగ్రీ కాలేజీ, ఆర్‌ కే డిగ్రీ కాలేజీ, వశిష్ట డిగ్రీ కాలేజీ, వశిష్ట జూనియర్‌ కాలేజీ లో ఏర్పాటుచేసిన కేంద్రాలను పరిశీలించి పరీక్ష నిర్వహణ తీరుతున్నలను నిశితంగా పరిశీలించారు. బయోమెట్రిక్‌ ద్వారా అభ్యర్థుల హాజరు, అభ్యర్థుల తనిఖీ, హాజరు, మౌలిక వసతులను పరిశీలించి, నిర్ణీత సమయంలో ప్రశ్నా పత్రాల పంపిణీ చేశారా, ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా వంటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో 78.79 శాతం అభ్యర్థులు హాజరయ్యారని కలెక్టర్‌ తెలిపారు. మొత్తం 4,797 అభ్యర్థులకుగాను 3,780 మంది అభ్యర్థులు హాజరుకాగా 1,017 మంది గైర్‌ హాజరయ్యారని ఆయన తెలిపారు.

జిల్లా యంత్రాంగం ముందస్తుగానే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో, సజావుగా ప్రిలిమ్స్‌ పరీక్షలు ముగిసాయి.

Check Also

నిజామాబాద్‌కు రూ. 30 లక్షల విలువచేసే అంబులెన్సు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అథాంగ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »