నందిపేట్, సెప్టెంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నందిపేట్ మండలంలోని ఖుదావంద్ పూర్ గ్రామంలోని ఎస్ సి, బి సి. వసతి గృహాలను బుధవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసారు. వసతి గృహాలలోని మరుగు దొడ్లు పరిశీలించారు.
వంద మంది విద్యార్థుల కు మూడు మరుగు దొడ్లు ఉండటం బాధ వ్యక్తం చేసారు. ఎప్పుడో నిర్మించిన వసతి గృహం కావడంతో లీకేజీలు అవుతున్నాయని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వారితో కలిసి భోజనం చేసారు. ప్రక్కనే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ను చూసారు. చెత్త చెదారం ఉండటంతో శుభ్రం చేయించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. సకాలంలో టీచర్లు రాకపోవడం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన వెంట బిజెపి నాయకులు పాల్గొన్నారు.