Breaking News

గ్రూప్స్‌ పరీక్ష నిర్వహణకు సన్నద్దం కావాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జిల్లాలలో గ్రూప్స్‌ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ సన్నద్ధం కావాలని తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ మహేందర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఎం. మహేందర్‌ రెడ్డి గ్రూప్స్‌ పరీక్షల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ, గ్రూప్స్‌ పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి, అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయో లేవో పరిశీలించాలని, ఈ ప్రక్రియ రేపటి లోగా పూర్తి చేయాలని కమిషన్‌ చైర్మన్‌ కలెక్టర్లను ఆదేశించారు.

గ్రూప్‌ 3 పరీక్షకు 3 పేపర్లు, గ్రూప్‌ 2 పరీక్ష 4 పేపర్లు పెద్ద ఎత్తున సభ్యులు ఉన్న నేపథ్యంలో రీజనల్‌ కోఆర్డినేటర్‌ పరిధిలో స్ట్రాంగ్‌ రూమ్‌ గుర్తించాలని అన్నారు. రీజనల్‌ కోఆర్డినేటర్‌ పరిధిలో అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన మేర స్ట్రాంగ్‌ రూమ్‌ ఉండాలని అన్నారు.

కామారెడ్డి జిల్లాలో గ్రూప్‌ 3 పరీక్షకు 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, 8300 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు, ఈ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. స్ట్రాంగ్‌ రూం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

విడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, అదనపు ఎస్పీ నరసింహ రెడ్డి, డిఎస్పీ నాగేశ్వర్‌ రావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, రీజనల్‌ కో ఆర్డినేటర్‌ విజయ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రజావాణిలో ఫిర్యాదులు

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »