Breaking News

బాలల దినోత్సవంలో పాల్గొన్న కామారెడ్డి జిల్లా ఎస్‌పి

కామారెడ్డి, నవంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

గురువారం జిల్లా ఎస్పీ భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ బాలసదన్‌ పిల్లలతో కామారెడ్డి జిల్లా గర్ల్స్‌ హైస్కూల్లో బాలల దినోత్సవం జరుపుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… ఉన్నత లక్ష్యం సాధించడానికి ఏకాగ్రత అవసరమనీ, ఇష్టపడి చదివితే సమగ్ర అభివృద్ధికి సూచికగా నిలుస్తాయని అన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తమ విధ్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అకాంక్షించారు. అనంతరం జిల్లా గర్ల్స్‌ హైస్కూల్లో జరుగుతున్న టీచర్స్‌ డే ప్రోగ్రాం లో పాల్గొని జిల్లా ఎస్పీ గారు స్వయంగా షీ టీం, 100 డైల్‌, సైబర్‌ క్రైమ్‌ గురించి అడిగి తెలుసుకొని వాటి ప్రాధాన్యత గురించి వివరించారు.

కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ విక్టర్‌, జడ్పీ సి.ఈ. ఒ., జిల్లా సంక్షేమ అధికారి చందర్‌ నాయక్‌, కామారెడ్డి ఎస్‌. హెచ్‌. ఓ. చంద్రశేఖర్‌ రెడ్డి, బాల సదన్‌ టీచర్లు, చిన్నారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 గురువారం, ఏప్రిల్‌ 10, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »