సకాలంలో రైతులకు బిల్లుల చెల్లింపులు జరగాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ జరిగిన వెంటనే ఆన్లైన్‌లో ఓపీఎంఎస్‌ వివరాలను నమోదు చేసేలా పక్కాగా పర్యవేక్షణ చేయాలన్నారు. మాక్లూర్‌ మండలం ఒడ్డాట్‌పల్లిలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ మంగళవారం సందర్శించారు.

ఏఈఓ ధ్రువీకరణ పత్రాన్ని జతపరుస్తూ, ఆన్లైన్‌ లో సన్న ధాన్యం వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని, సరిపడా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే సింహభాగం ధాన్యం సేకరణ జరిగినందున, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట డీసీఓ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »