కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబరు 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌లోగల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్‌ రూమ్‌, కిచెన్‌, ప్లే గ్రౌండ్‌ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికలో పొందుపర్చిన వాటికి అనుగుణంగానే ఆహార పదార్థాలు ఉన్నాయా అని తనిఖీ చేశారు.

సరుకులను స్టీల్‌ డబ్బాలలో నిల్వ ఉంచి, తప్పనిసరిగా వాటికి మూతలు బిగించాలని, కూరగాయలు, ఇతర సరుకులను నేలపై ఉంచకూడదని హితవు పలికారు. విజయ కంపెనీ వంటనూనె, విజయ డైరీ పాలను వినియోగించాలని సూచించారు.

నాసిరకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసిన సమయంలో అధికారులకు సమాచారం అందించాలన్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఆర్మూర్‌ ఆర్డీఓ రాజాగౌడ్‌ తదితరులు ఉన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.12, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »