ఎస్సీ కాలనీని సందర్శించిన ఏకసభ్య కమిషన్‌

నిజామాబాద్‌, జనవరి 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఎస్సీ ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం బహిరంగ విచారణకు విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌ గురువారం సాయంత్రం ముప్కాల్‌ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీని సందర్శించారు.

షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వివిధ వర్గాల వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిశీలించి, ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో అన్ని అంశాలను పొందుపరుస్తామని ఏకసభ్య కమిషన్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ తెలిపారు. ఆయన వెంట షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి సంస్థ అదనపు సంచాలకులు శ్రీధర్‌, ఆర్మూర్‌ ఆర్డీఓ రాజాగౌడ్‌, డీ.ఎస్‌.సీ.డీ.ఓ నిర్మల తదితరులు ఉన్నారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »